సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో లక్షలాది మంది నిరుద్యోగులు వరుసగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల్లో దాదాపు లక్ష మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. మరో 13 రోజుల్లోనే పంచాయతీ కార్యదర్శుల పరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. వీఆర్వో పోస్టుల తరహాలోనే జిల్లాలో ఈ పోస్టులకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం... జిల్లాలో ఉన్న 88 పోస్టులకు 57,878 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
అంటే ఒక్కో పోస్టుకు సగటున 657 మంది పోటీ పడుతున్నారు. ఇటీవలే జరిగిన వీఆర్వో పరీక్షలకు ఒక్కో పోస్టుకు సగటున వెయ్యి మంది అభ్యర్థులు పోటీపడ్డ విషయం విదితమే. కార్యదర్శి పోస్టులకు వెల్లువెత్తిన దరఖాస్తుల సంఖ్య కూడా అదే తీరు పోటీని తలపిస్తోంది. వీఆర్వో పరీక్షకు సిద్ధమైన అభ్యర్థులే ఎక్కువ మంది కార్యదర్శి పోస్టుకు సైతం దరఖాస్తు చేసుకున్నారు. కానీ కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలనే నిబంధన ఉండటంతో కార్యదర్శి పోస్టులకు దరఖాస్తుల సంఖ్య కొంత మేరకు తగ్గినట్లు కనిపిస్తోంది. షెడ్యూలు ప్రకారం.. ఈ నెల 23న పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో 165 పరీక్ష కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలను ఏపీపీఎస్సీకి పంపించారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,677 పంచాయతీ కార్యదర్శుల నియామకానికి గత ఏడాది డిసెంబరు 30న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగా జిల్లాలో మొత్తం 88 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. గత నెల 26న దరఖాస్తుల గడువు ముగిసింది. రిజర్వేషన్ల వారీగా అన్ని జిల్లాల్లోని ఖాళీల వివరాలను నోటీఫికేషన్లోనే పొందుపరిచింది. పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా నేరుగా భర్తీ చేస్తారు.
ఒక్కో పోస్టుకు 657
Published Mon, Feb 10 2014 2:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement