* ప్రభుత్వంపై మండలిలో ధ్వజమెత్తిన ప్రతిపక్షాలు
* అల్లాఉద్దీన్ దీపం ఉంటే తప్ప హామీల అమలు సాధ్యం కాదు: సీఆర్
* కేంద్రం నిధులివ్వడానికి రాజ్యాంగ పరంగా అభ్యంతరాలు
* భూములున్న ప్రాంతమైతే నిధులు మిగిలేవి: వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కొత్త రాజధానిపై ప్రభుత్వం ముందుగా నిర్ణయం తీసుకొని ప్రకటన చేశాక దానిపై చట్టసభలో చర్చించాలనడం సహేతుకంగా లేదని శాసనమండలిలో ప్రతిపక్ష పార్టీలు ఏపీ ప్రభుత్వ తీరును తూర్పారబట్టా యి. రాజధాని ప్రకటన సమయంలో రాష్ట్ర ప్రజ లకు సీఎం కలల ప్రపంచం చూపించారని పలువురు సభ్యులు మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి కావాల్సిన వనరులను కేంద్రం అందజేయాలని కోరడంతో పాటు 8 అంశాలకు సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి పి. నారాయణ శాసనమండలిలో శుక్రవారం ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చలో మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సి.రామచంద్రయ్య (సీఆర్) మాట్లాడుతూ.. రాజధాని ప్రకటన సమయంలో చెప్పిన వాటిని పూర్తి చేయాలంటే అల్లాఉద్దీన్ అద్భుతదీపం చంద్రబాబు చేతిలో ఉంటే తప్ప సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం చేయగలిగేవి చెబితేనే బాగుంటుందని సలహా ఇచ్చారు.
రైతులకు ఎకరాకు 24 సెంట్లే వస్తాయి..
తమకు అనుకూలురకు ప్రయోజనం కలిగించేందుకే విజయవాడ రాజధాని అంటూ ప్రకటించారనే విషయం ప్రభుత్వ తాజా నిర్ణయంతో తేటతెల్లమైందని వైఎస్సార్ శాసనమండలి పక్ష నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు విమర్శించారు. విజయవాడలో రాజధాని ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాకపోయినప్పటికీ, ప్రభుత్వ భూములున్న చోట రాజధాని ఏర్పాటు చేయ డం వల్ల భూ సేకరణకు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు చేయకుండా మిగుల్చుకోవచ్చన్నారు. ఆ నిధులతో రాజధానిలో ఇతర మౌలిక వసతులను సమకూర్చుకునే వీలుండేదని మండలి దృష్టికి తీసుకొచ్చారు.
ప్రకటన చేశాక రాజధానిపై చర్చా?
Published Sat, Sep 6 2014 2:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement