నల్లగొండ టౌన్, న్యూస్లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే పేదలందరికీ ఇళ్ల స్థలాలతోపాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. సోమవారం స్థానిక మామిళ్లగూడెం ఇందిరమ్మ కాలనీలో హౌసింగ్ బోర్డు నిధులు *1.09 కోట్లతో నిర్మించనున్న సీసీరోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా సీసీ రోడ్లు మం జూరు చేయించామన్నారు. కంచనపల్లి సమీపంలో నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం 150 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు తెలిపారు. ఇళ్లకు కరెంటు బిల్లులు వేలల్లో వస్తున్నాయని కాలనీ మహిళలు తెలపడంతో ఎమ్మెల్యే ట్రాన్స్ కో ఎస్సీతో ఫోన్లో మాట్లాడి బిల్లులను సరిచేయించాలని ఆదేశించారు.
టీడీపీ వాళ్లు తెలంగాణ ద్రోహులు
తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతున్న సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్న టీడీపీ నాయకులు తెలంగాణ ద్రోహులుగా మారారని, మానవత్వం లేని కమ్యూనిస్టులు మూర్ఖులుగా వ్యవహరిస్తున్నారని వెంకట్రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణకు అడ్డుపడుతున్న టీడీపీ, సీపీఎంల నాయకులను గ్రామాలకు రాకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిగూడెంలో 60 ఎకరాల భూమిలో నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించాలని నిర్ణయిస్తే కోర్టుకు వెళ్లి నిర్మాణం కాకుండా సీపీఎం నేతలు అడ్డుకున్నారని తెలిపారు. వెలుగుపల్లి, రసూల్పురం, మామిళ్లగూడెం గ్రామాల్లో అర్హులైన పేదల కోసం ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం స్థల సేకరణ చేస్తుంటే సీపీఎం నాయకులు అడ్డుతగులుతున్నారని విమర్శించారు.
పట్టణంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తుంటే అసత్య అరోపణలు చే స్తూ ప్రజలకు మోసం చేస్తున్నారని చెప్పారు. కమ్యూనిస్టుల కుయుక్తులను ప్రజలు గమనించాలని కోరారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శరత్బాబు, నన్నూరి విష్ణువర్ధన్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వంగూరు లక్ష్మయ్య, నాయకులు గుమ్ముల మోహన్రెడ్డి, బాబ, పెరికకిషన్, ఉడుత వెంకన్న, పనస శంకర్గౌడ్, దైద వెంకట్రెడ్డి, చింతల భిక్షం, మార్త యాదగిరిరెడ్డి, దైద శేఖర్రెడ్డి, గడ్డం అనూప్రెడ్డి, పెరిక మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
పేదలందరికి పక్కా ఇళ్లు
Published Tue, Dec 24 2013 4:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement