రాజధాని నిర్మాణానికి విరాళాన్ని ప్రకటించిన 'పల్లె' | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణానికి విరాళాన్ని ప్రకటించిన 'పల్లె'

Published Sun, Jun 15 2014 12:49 PM

రాజధాని నిర్మాణానికి విరాళాన్ని ప్రకటించిన 'పల్లె' - Sakshi

ఆంధ్రప్రదేశ్-లో ఐటీ పెట్టుబడులు ఎక్కడ పెట్టిన ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి పల్లె రఘనాథ రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సమాచార, ఐటీ శాఖ మంత్రిగా పల్లె రఘునాథరెడ్డి బాధ్యతలు స్వీకారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురం, విశాఖపట్నం జిల్లాలలో ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిన భూముల్లో కొత్త ఐటీ కంపెనీలు తీసుకువస్తామని ఆయన వెల్లడించారు.

 

ఎన్నారైల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తామన్నారు. విదేశాల్లోని ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి సహకరించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కొత్త రాజధాని నిర్మాణానికి విరాళాలు అందించి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని  ఎన్నారైలకు సూచించారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం తన మొదటి నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు పల్లె రఘునాథరెడ్డి ప్రకటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement