సాక్షి, అనంతపురం :
అనంతపురం నగరానికి చెందిన రమణయ్య, లక్ష్మిదేవి దంపతులు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఎప్పుడూ పచ్చడి మెతుకులతోనే కడుపు నింపుకునే చిన్నారులు.. ఈ దసరా పండుగకు ఓళిగలు చేసిపెట్టాలని తల్లిని కోరారు. ‘అలాగేనమ్మా! టోరు(రేషన్షాపు)లో మనకు నూనీ, కందిబ్యాళ్లు ఇత్తారేమో సూత్తాం! ఇత్తే అలాగే సేత్తాలే’ అని తల్లి చెప్పింది. మరుసటి రోజు ఇంటి సమీపంలోని స్టోరు డీలర్ వద్దకు వెళ్లి ‘అన్నా..అక్టోబర్ నెలైనా మాకు నూనీ, కందిబ్యాళ్లు ఇత్తారా’ అని అడిగింది. ‘ఎక్కడివి?! ఇంత వరకూ అవి మాకు అంద నేలేదు. అసలు పామాయిల్, కందిబ్యాళ్లు మీరు మరచిపోండి’ అంటూ డీలర్ సమాధానం చెప్పాడు. దీంతో లక్ష్మిదేవి దిగాలుగా ఇంటికి వెళ్లిపోయింది.
జిల్లాలో ఐదు నెలలుగా రేషన్షాపుల ద్వారా పామాయిల్ అందక పోవడంతో పేదలు ఇక్కట్లు పడుతున్నారు. కార్డుదారులంతా తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. దీనికి తోడు ఈ నెల కందిపప్పును సరఫరా చేయకపోవడంతో పేదోళ్ల ఇబ్బందులు మరింతగా పెరిగాయి. జిల్లాలోని దాదాపు 11 లక్షల పేద కుటుంబాలు వీటి కోసం ఎదురు చూస్తున్నాయి. జిల్లాలోని రేషన్కార్డుదారులకు ప్రతినెలా బియ్యం, కిరోసిన్, పంచదార, పామాయిల్, కందిపప్పు వంటి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుంటారు. బియ్యం, కిరోసిన్ యథావిధిగా సరఫరా చేస్తున్న పౌరసరఫరాల శాఖ అధికారులు.. పామాయిల్, కందిపప్పు విషయానికి వచ్చేసరికి పట్టించుకోవడం మానేశారు. ఒక్కొక్క కార్డుదారుడికి నెలకు కిలో పామాయిల్ చొప్పున 11 లక్షల కిలోలు సరఫరా చేయాల్సి వుంది. బహిరంగ మార్కెట్లో పామాయిల్ ధర రూ.63 వరకు ఉండగా.. రేషన్షాపులో సబ్సిడీపై రూ.40కే విక్రయిస్తారు. బహిరంగ మార్కెట్ ధరకే ప్రభుత్వం పామాయిల్ను కొనుగోలు చేస్తుంది. ఇందులో రూ.10 కేంద్రం, రూ.13 రాష్ట్ర ప్రభుత్వం భరించి.. మొత్తం రూ.23 కార్డుదారుడికి సబ్సిడీ ఇస్తాయి. సాధారణంగా పామాయిల్ మలేషియా దేశం నుంచి కాకినాడ పోర్టుకు, అక్కడి నుంచి జిల్లాలకు దిగుమతి అవుతుంది. ప్రస్తుతం దిగుమతికి ఇబ్బంది లేదు. కాకినాడ రిఫైనరీల్లో కావాల్సినంత పామాయిల్ అందుబాటులో ఉంది. ఇక్కడొచ్చిన సమస్యల్లా కేంద్రం నుంచి రాయితీ రాకపోవడమే. కేంద్రం భరించాల్సిన రూ.10పై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పామాయిల్ పంపిణీ కావడం లేదు. గడిచిన ఐదు నెలలుగా ఈ ఇబ్బంది ఉన్నా రాష్ట్ర స్థాయిలోని ఉన్నతాధికారులు కానీ, జిల్లాకే చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కానీ పట్టించుకోవడం లేదు. పామాయిల్ మాదిరిగానే కందిపప్పు కూడా జిల్లా వ్యాప్తంగా నెలకు 11 లక్షల కిలోలు ఇస్తున్నారు. రేషన్షాపులో కిలో రూ.50తో విక్రయిస్తున్నారు. అదే బహిరంగ మార్కెట్లో రూ.70 వరకు ధర ఉంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్లో ఒకే కాంట్రాక్టర్కు కందిపప్పు సరఫరా బాధ్యత అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ సమయానికి సరఫరా చేయకపోవడంతో పేదలకు అందడం లేదు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి కార్డుదారులెవరూ కందిపప్పును అందుకోలేదు. ఇక ఒక్కొక్క కార్డుదారుడికి అర కిలో చొప్పున పంచదార పంపిణీ చేయాల్సివుండగా.. ముందుగా ఎవరొస్తే వారికే అన్న రీతిలో పరిస్థితి తయారైంది. ఈ విషయాన్ని ‘సాక్షి’.. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకటేశం దృష్టికి తీసుకెళ్లగా పామాయిల్, కందిపప్పు అందని మాట వాస్తవమేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్యఉందన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
పప్పులుడకట్లేదు..
Published Tue, Sep 30 2014 2:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement