తాడేపల్లి రూరల్/సాక్షి, గుంటూరు: రాజధాని నిర్మాణ గ్రామాల్లో జరిగిన దహనకాండపై పోలీసుల క్లూస్ టీం మంగళవారం నుంచి దర్యాప్తును ముమ్మరం చేసింది. సంఘటన స్థలంలో లభ్యమైన పాదముద్రల ఆధారంగా వివరాల సేకరణకు నడుంకట్టారు. తాడేపల్లిలోని రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్లు, గతంలో ఉండవల్లి, పెనుమాక పంచాయతీల పరిధిలో చిన్నచిన్న గొడవల్లో తలదూర్చిన యువకులను, వీరితో పాటు రైతులను సైతం తాడేపల్లి పోలీసుస్టేషనుకు పిలిపించారు.
సంఘటన స్థలంలో దొరికిన పాదముద్ర ఆధారంగా, దానికి సరిపోలి ఉండే వారి పాదముద్రలు సేకరించారు. ఎందుకు పిలిపించారో తెలియక రైతులు ఒకింత అసహనానికి గురయ్యారు. రౌడీషీటర్లతోపాటు తమ పాదముద్రలు కూడా సేకరించడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు జరిగిన నష్టం గురించి ఏ ఒక్కరూ మాట్లాడకుండా విచారణ పేరుతో ప్రతిరోజూ ఇలా పోలీసుస్టేషనుకు పిలిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గౌరవంగా బతుకుతున్న తమను ఇలా ప్రతిరోజూ స్టేషనుకు పిలిపించడం వల్ల ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఇలానే కొనసాగితే తమకు చావు తప్ప వేరేమార్గం లేదంటున్నారు.
మూడు రోజుల క్రితం పెనుమాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, సంఘటనలో తాను పాల్గొన్నట్టు తెలిపి చివరకు పోలీసులను అయోమయానికి గురిచేశాడు. అతను అబద్ధాలు చె్డపుతున్నట్టు తేలడంతో తిరిగి విచారణ చేస్తున్నారు.
మరోవైపు ప్రత్యక్ష సాక్షులు కొందరిని పిలిపించిన పోలీసులు వారు చెప్పిన ఆధారాల ప్రకారం ఒంగోలు నుంచి వచ్చిన నిపుణులతో ఇద్దరు నిందితులకు సంబంధించిన ఊహా చిత్రాలు సిద్ధం చేశారు.
వైఎస్సార్సీపీ వర్గీయులపై ఆగని పోలీసుల వేధింపులు...
దుశ్చర్యకు పాల్పడిన నిందితులకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో పోలీసులు పలువురు అనుమానితులను స్టేషన్లకు పిలిచి విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా పోలీసులు ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన అనేక మంది వైఎస్సార్సీపీ వర్గీయులను విచారణ పేరుతో తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.
టీడీపీ వర్గీయుల జోలికి వెళ్లకుండా కేవలం వైఎస్సార్ సీపీకి సంబంధించిన వారినే టార్గెట్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రైతులు సోమవారం గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల తీరు మాత్రం మారినట్లు కనిపించడం లేదు. విచారణ పేరుతో రోజుల తరబడి పోలీస్స్టేషన్లలో కూర్చోబెడుతుండటంతో గ్రామాల్లో తీవ్ర అలజడి రేగుతోంది. ఇప్పటికైనా పోలీసులు వివక్ష మాని విచారణ పారదర్శకంగా జరపాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
దహన కాండకు పాల్పడిన ఆ ఇద్దరూ ఎవరు..?
రాజధాని ప్రాంతంలోని పొలాల్లో దహన కాండకు పాల్పడింది ఇద్దరు వ్యక్తులేనని మొదటి నుంచి పోలీసులు చెబుతున్నప్పటికీ ఆ ఇద్దరూ ఎవరనేది తేలడంలేదు. కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నదాని ప్రకారం చూసినా ఇద్దరు వ్యక్తులే ఈ సంఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితులు మాత్రం పక్కా పథకం ప్రకారం సెల్ఫోన్, వాహనాలు వినియోగించకుండా జాగ్రత్తపడినట్లు అర్థమవుతోంది. ఈ కేసులో నిందితులను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది.
పాదముద్రలు పట్టించేనా?
Published Wed, Jan 7 2015 2:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement