సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నడవలేక.. కళ్లు సరిగా కనిపించని వృద్ధులు, వికలాంగులకు ముఖ్యమంత్రి బాబు కొత్తకష్టాలు తెచ్చిపెట్టారు. చివరి మజిలీలో వారిప్రశాంతతను దూరం చేశారు. ప్రభుత్వం ఇచ్చే పింఛను కోసం ఎండలో.. గంటల తరబడి క్యూలో నిల్చోవటం కనిపించిం ది. అదేవిధంగా కాళ్లు, చేతులు, కళ్లు లేని వికలాంగులు సైతం ప్రభుత్వం ఇచ్చే భృతి కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. వైఎస్సార్ హయాంలో వారికి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా పింఛను మొత్తాన్ని ఇంటికే వచ్చి ఇచ్చేవారు. ఆయన మరణం తర్వాత సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ విధానం పూర్తిగా మారింది. రకరకాల కొర్రీలు పెట్టి వేలాదిమందిని తొలగించారు. అదేవిధంగా అర్హుల ఇంటికే చేర్చే విధానానికి నీళ్లొదిలారు. పండుటాకులు, వికలాంగులను రోడ్డుమీద గంటలకొద్దీ నిలబెట్టి వేలిముద్రలు, ఆధార్ కార్డుల పరిశీలించి పింఛన్ను ఇచ్చిపంపుతున్నారు.
జిల్లాలో 2,47,965మందివృద్ధులు,వికలాంగులు, వితంతువులకు ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్లు బుధవారం నుంచి పోస్టాఫీసుల ద్వారా ప్రారంభమైంది. బయోమెట్రిక్ విధానం ద్వారా ప్రారంభమైన పింఛన్ల పంపిణీ మొదటిరోజు గందరగోళంగా మారింది. ఈ విధానంపై అధికారులకు అవగాహన లేకపోవటం.. అర్హులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవటం కనిపించిం ది. బుధవారం జిల్లావ్యాప్తంగా ‘సాక్షి’ చేపట్టిన విజిట్లో లబ్ధిదారులు పడుతున్న కష్టాలను తెలుసుకుంది.
మ్యాచ్ కాని వేలిముద్రలు
అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ఇటీవల వృద్ధులు, వికలాంగుల నుంచి వేలి ముద్రలు, ఐరిస్, ఆధార్ కార్డు నంబర్లను తీసుకుంది. కొద్దిరోజుల ముందు తీసుకున్న వేలిముద్రలు, ఆధార్ నంబర్లను బయోమెట్రిక్ సిస్టమ్ గుర్తించడం లేదు. ఆ వేలిముద్రలు, ఆధార్ నంబర్లు తప్పని చెపుతుండటంతో జిల్లావ్యాప్తంగా వేలాది మందిని తిప్పిపంపేశారు.
అదేవిధంగా అనేక ప్రాంతాల్లో బయోమెట్రిక్ సిస్టమ్ పనిచేయకపోవటంతో సాయంత్రం వర కు వేచి ఉండి ఒట్టిచేతులతో తిరిగి వెళ్ల టం కనిపించింది. వేలిముద్రలు, ఆధార్ నంబర్లు తప్పు ఉందని చెప్పటంతో అనేకమంది మీసేవ కేంద్రాలకు, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి చుట్టూ తిరుగుతున్నారు. సైదాపురం, ఉదయగిరి పరిధిలో పోస్టాఫీసులకు పింఛను నిధులు రాకపోవటంతో పంపిణీ ఆలస్యమైంది. సూళ్లూరుపేట పరిధిలో బుధవారం పింఛన్ల పంపిణీ ప్రక్రియే ప్రారంభం కాలేదు.
రైతులు.. చేనేతలకు కొత్త కష్టాలు
రైతులు, చేనేత కార్మికుల వేలి ముద్రలు మ్యాచ్ కావటం లేదు. వీరు రోజూ వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండటం.. కష్టపడటంతో చేతివేళ్లు కొంత అరిగిపోయి ఉంటాయి. అదేవిధంగా చేనేతలు రోజూ బట్టలకు రంగులు అద్దుతుంటారు. ఈ కారణాలతో నాడు తీసుకున్న వేలిముద్రలకు.. నేడు తీసుకుంటున్న వేలిముద్రలకు తేడా కనిపిస్తోంది.
పడిగాపులు కాస్తేనే.. పింఛన్
Published Thu, Feb 5 2015 3:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement