నెల్లూరు(బారకాసు): పింఛన్దారులకు పది రోజులుగా ఎదురుచూపులు తప్ప.. పింఛన్ నగదు అందలేదు. గతంలో ఒకటో తేదీన ఠంచన్గా పింఛన్ అందేది. ఇప్పుడా పరిస్థితులు కనుమరుగయ్యాయి. పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియక వృద్ధులు ఆందోళన చెందుతున్నా రు. 10వ తేదీ దాటిపోయినా పింఛన్ సొమ్ము అందలేదు. దీంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. నిబంధనల పేరుతో ప్రభుత్వం తమతో చెలగాటం ఆడుతుందని పింఛన్దారులు ఆవేదన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వ విధానాలపై పింఛన్దారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈనెల పింఛన్ వస్తుందా.. రాదా అని సందేహ పడుతున్నారు. గ్రామాల్లో పింఛన్ పంపిణీ చేసే కమ్యూనిటీ సర్వీసు ప్రొవైడర్ల జాడే లేదు. పింఛన్ సొమ్ము మంజూరైతే లబ్ధిదారుల వివరాలు అక్విటెన్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు అందేవి. అలాంటి ఆదేశాలు ఇంకా అందలేదని, ప్రభుత్వం ఇంకా పింఛన్ సొమ్మును మంజూరు చేయలేదని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా డీఆర్డీఏ పరిధిలో 2,61,123 పింఛన్ దారులున్నారు.
వారందరికి సుమారు రూ.5 కోట్లు పంపిణీ జరుగుతోంది. ఒక్క నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోనే 22,036 మంది లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. పింఛన్ సొమ్మును ప్రభుత్వం పలు బ్యాంకుల అకౌంట్లో జమ చేస్తుంది. ఇప్పటి వరకు ఆయా బ్యాంకుల ఖాతాలకు ప్రభుత్వం సొమ్ము పంపలేదని, అందువల్లనే జాప్యం జరుగుతున్నట్లు సంబంధిత శాఖలోని ఓ అధికారి పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,61,123 మంది పింఛన్దారులున్నారు. వారిలో వృద్ధులు 1,24,677 మంది, వితంతువులు 90,042, వికలాంగులు 30,009, కల్లుగీత కార్మికులు 676, చేనేత కార్మికులు 4,843, అభయహస్తం కింద 10,876 మంది పింఛన్దారులున్నారు.
ప్రభుత్వం నుంచి రాగానే అందజేస్తాం
ఈనెల పింఛన్ సొమ్ము విడుదల చేయడం ఎందుకు ఆలస్యమైందో తెలియలేదు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పింఛన్ సొమ్ము మాకు రాలేదు. పింఛన్ సొమ్ము రాగానే వెంటనే పింఛన్ దారులకు అందజేస్తాం. అయితే ఎప్పుడు అనేది తాను కచ్చితంగా చెప్పలేను. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
- చంద్రమౌళి, ప్రాజెక్ట్ సంచాలకులు, డీఆర్డీఏ
పింఛన్ కష్టాలు
Published Sun, Jul 13 2014 2:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement