ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు

Published Tue, Sep 22 2015 8:40 AM

people Angre at MLA

విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో మంగళవారం వార్డుల సందర్శన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఒకటవ వార్డు సందర్శనకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, చైర్‌పర్సన్ శ్రీదేవిని స్థానికులు అడ్డుకున్నారు. నెలరోజులుగా కుళాయిల ద్వారా బురదనీరు సరఫరా చేస్తుండడంపై మండిపడ్డారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంపై ప్రశ్నించారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన స్థానిక టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు.
 

Advertisement
Advertisement