1625 కిలోమీటర్లు దాటిన యాత్ర | Sakshi
Sakshi News home page

1625 కిలోమీటర్లు దాటిన యాత్ర

Published Sat, Mar 31 2018 7:45 AM

People Shairing Their Sorrows To YS Jagan - Sakshi

ప్రజాసంకల్పయాత్రకు పెదకూరపాడు నియోజకవర్గంలోని పాటిబండ్లలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పాటిబండ్ల వద్ద 1625 కిలోమీటర్లు దాటింది. గ్రామానికి చెందిన అల్లం ఉష, గాదె ఇన్నారెడ్డి, జాన్వేష్‌రెడ్డి, ఇన్నమ్మలు భారీ కేక్‌ ఏర్పాటు చేసి జననేత చేతుల మీదుగా కట్‌ చేయించారు. ‘జై జగన్‌.. జైజై జగన్‌’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభిమాన నేతను ఆత్మీయంగా పలకరించి, ఆ జ్ఞాపకాలను సెల్ఫీలలో బంధించి ఆనందంలో మునిగిపోయారు.

Advertisement
Advertisement