జీవనోపాధిపై దెబ్బ కొట్టారయ్యా.. | Sakshi
Sakshi News home page

జీవనోపాధిపై దెబ్బ కొట్టారయ్యా..

Published Fri, Feb 23 2018 7:05 AM

people sharing their sorrows to ys jagan - Sakshi

తెలుగుదేశం పార్టీ నాయకులు నుచ్చుపొద జాలర్ల సహకార సంఘంలో అక్రమాలకు తెరతీసి తమ జీవనోపాధిపై దెబ్బకొట్టారని పామూరు మండలం నుచ్చుపొద గ్రామానికి చెందిన జాలర్లు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయారు. అర్హులైన వారిని జాలర్ల సంఘం నుంచి తొలగించి దొడ్డిదారిన  టీడీపీకి చెందిన వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించడమే కాకుండా, యానాది సభ్యులకు రావాల్సిన రూ.1.36 కోట్లు దోచుకున్నారని జననేత ఎదుట మొరపెట్టుకున్నారు. జాలర్ల సహకార సంఘంలో టీడీపీ నాయకుల అక్రమాలపై న్యాయ విచారణ జరిగేలా పోరాడాలని విన్నవించారు.

Advertisement
Advertisement