పింఛను తొలగించారు | Sakshi
Sakshi News home page

పింఛను తొలగించారు

Published Wed, Feb 28 2018 6:48 AM

People sharing their sorrows to ys jagan - Sakshi

‘అన్నా 1980 నుంచి వికలాంగ పింఛను పొందుతున్నా. 2014లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే పింఛను తొలగించార’ని మర్రిపూడి మండలం శివరాయునిపేటకు చెందిన దివ్యాంగుడు మేళం కుర్మయ్య పాదయాత్రలో జగన్‌ను కలిసి తన గోడు చెప్పుకున్నాడు. వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుడినన్న కక్షతో తన పింఛను తొలగించారని కుర్మయ్య జగన్‌కు వివరించాడు.  వికలాంగులపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గాన్ని ఎండగట్టాలని కోరాడు.

పింఛను ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించామన్న అక్కసుతో గ్రామంలోని టీడీపీ నాయకులు తనకు నాలుగేళ్లుగా పింఛను ఇవ్వకుండా వృద్ధురాలైన తనను వేధిస్తున్నారయ్యా.. అంటూ త్రిపురచంద్రపాలేనికి చెందిన గంగారం పాములమ్మ వైఎస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందించి న్యాయం చేయాలని కోరింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement