Sakshi News home page

పనికి తగిన వేతనం ఇవ్వడం లేదన్నా..

Published Wed, Feb 28 2018 7:12 AM

People sharing their sorrows to ys jagan - Sakshi

2002 డీఎస్సీ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో నియామకమైన హెల్త్‌ అసిస్టెంట్లు, మేల్‌/ఫిమేల్‌(ఎంపీహెచ్‌ఎఎం, ఎంపీహెచ్‌ఎఎఫ్‌), యూరోపియన్‌ స్కీమ్‌ కింద నియామకమైన ఏఎన్‌ఎంలు ఉప్పలపాడు వద్ద పాదయాత్రలో జగన్‌ను కలిసి తమ సమస్యను తెలుపుతూ వినతిపత్రం ఇచ్చారు. 2002లో నియమితులైన వారికి 2009 పీఆర్‌సీ ప్రకారం రూ.10 వేలు ఇస్తూ.. 2016లో చేరిన ఏఎన్‌ఎంలకు 2010 పీఆర్‌సీ ప్రకారం రూ.21 వేలు ఇస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా వ్యత్యాసం చూపుతున్నారని వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం చేసి, ఉద్యోగ భద్రత కల్పించేందుకు కృషి చేయాలని జననేతను కోరారు. జగన్‌ను కలిసిన వారిలో వీఎస్‌ ప్రసాద్, ఎల్‌.శ్రీనివాసరెడ్డి, వి.నరసారెడ్డి, డి.సుజాత, డి.శ్యామల, ఎం.ఆదిలక్ష్మి ఉన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement