పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి | Sakshi
Sakshi News home page

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి

Published Thu, Mar 1 2018 7:00 AM

People sharing their sorrows to ys jagan  - Sakshi

చీరాలటౌన్‌: పేదలైన ముస్లింలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చీమకుర్తి ఎల్లయ్య నగర్‌కు చెందిన ముస్లిం మహిళ షేక్‌ షకీనాబేగం ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. వైసీపీ అధికారంలోకి రాగానే పేదలందరికీ నివేశన స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరింది.

నలుగురు ఆడపిల్లలు..
కందుకూరు రూరల్‌: ‘నా భర్త గ్రానైట్‌ కాలువలో పడి చనిపోయాడు. నలుగురు ఆడ పిల్లలు. భర్త చనిపోయినప్పుడు అధికారులు సాయం చేస్తామని చెప్పారు.. కాని ఏ ఒక్క నాయకుడు కానీ అధికారి కానీ పట్టించుకోవడం లేదు. ఇల్లు లేదు.. స్థలం లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాం’ అని వంకదారి కల్పన ఆవేదన చెందింది. తన సమస్యను జగనన్నకు చెప్పుకుందామని వచ్చానని చెప్పింది.

Advertisement
Advertisement