కడుపులో గడ్డలున్నాయి.. కాపాడండయ్యా ! | Sakshi
Sakshi News home page

కడుపులో గడ్డలున్నాయి.. కాపాడండయ్యా !

Published Wed, Mar 14 2018 6:49 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు:‘కడుపులో గడ్డలు ఉన్నాయి. ఆస్పత్రికి వెళ్తే ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయడం కుదరదంటున్నారయ్యా’ అంటూ కర్లపాలెం గ్రామానికి చెందిన కుక్కటి పండురెడ్డి జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ను కలసిన పండురెడ్డి మెడికల్‌ రిపోర్టులు చూపించి కన్నీటిపర్యంత మయ్యారు. గత ఏడాది ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రికి వెళ్లితే పరీక్షలకే రూ.30 వేలు ఖర్చయిందని వాపోయారు. మళ్లీ అనారోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లితే కడుపులో ఉన్న గడ్డలు తొలగించడానికి  గతంలో చేసిన వైద్య పరీక్షలను మళ్లీ చేయాలంటున్నారని చెప్పారు. డబ్బులు పెట్టి వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేదని, ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం అందేలా సాయం చేయాలని జననేత వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.

Advertisement
Advertisement