కంటి ఆపరేషన్‌కు సాయం చేయండన్నా.. | Sakshi
Sakshi News home page

కంటి ఆపరేషన్‌కు సాయం చేయండన్నా..

Published Mon, Apr 9 2018 7:00 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు :‘నా బిడ్డ పేరు వరప్రసాద్‌. ఆరేళ్ల వయస్సులో నా బిడ్డకు చూపు సరిగా లేకపోవడంతో దివంగత మహానేత రాజశేఖరరెడ్డి రికమండేషన్‌ లెటర్‌తో కంటి           ఆపరేషన్‌ చేయించాను. ఇప్పుడు నా బిడ్డకు 16 ఏళ్లు. రెండో కన్ను కూడా చూపు మందగించింది. ఆపరేషన్‌కు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. ఎటువంటి సాయం అందించడం లేదు’ అని కమలశ్రీ  ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్‌ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. తన బిడ్డకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూడాలని ఆమె జననేతను కోరారు.

Advertisement
Advertisement