గుంటూరు :ప్రస్తుతం బీసీ–సీ జాబితాలో ఉన్న దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని నవ దళిత క్రైస్తవ పరిరక్షణ సంఘం రాష్ట్ర కన్వీనర్ కొట్ల దిలీప్ తెనాలి వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రం వద్ద జననేత వైఎస్ జగన్ను ఆదివారం ఉదయం కలిసి క్రైస్తవుల సమస్యలు వివరించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ అంశంపై సానుకూలంగా స్పందించినట్లు గుర్తు చేశారు. ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని కోరుతూ జగన్కు వినతిపత్రం అందించారు.
Breadcrumb
దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చాలి
Published Mon, Apr 9 2018 7:28 AM
Related news
-
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చంద్రబాబు ఎలాంటివాడో చెప్పడానికి 2014 కూటమి మేనిఫెస్టో సరిపోతుందని మండిపడ్డారు. విలువలు, విశ్వసనీయత లేని బాబు.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడని విమర్శించారు. గుంటూరు పొన్నూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై నిప్పులు చెరిగారు.జననేత రాకతో పొన్నూరులో పండుగ వాతావరం నెలకొంది. సీఎం నినాదాలతో ప్రచార సభ మార్మోగిపోయింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుందన్నారు. ఈ యుద్ధంలో ఓ వైపు కౌరవ సేన, దృష్ట చతుష్టయం ఉందని విమర్శించారు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిని దుయ్యబట్టారు. ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు, ఉన్నాయని ఒక వదినమ్మ, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పేదవాడికీ మేలు చేసిన చరిత్రలేని వీళ్లంతా కూటమిగా చేరి ఇంటింటికీ మంచి చేసిన ఒకే ఒక్కడైన మీ జగన్తో యుద్ధం చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ నమ్ముకున్నది మిమ్మల్ని(ప్రజలు), పైనున్న ఆ దేవుడినే అని తెలిపారు. జగన్ పొత్తు ప్రజలతోనే ఉంన్నారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లకు ప్రజల ఇంటి అభివృద్ధిని నిర్ణయించేవన్నారు. పేదల తలరాతలను నిర్ణయించేవని చెప్పారు. వైఎస్ జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పతకాలన్నీ ఆగిపోతాయని తెలిపారు.సీఎం జగన్ పూర్తి ప్రసంగం విశ్వసనీయత ఉన్న ఈ ప్రభుత్వం మీద విలువలు లేని చంద్రబాబు ఎలా నోరుపారేసుకుంటున్నారో వింటున్నారు కదా14 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశాడో చెప్పకుండా జగన్ను తిడుతున్నాడుచంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడుపోయేకాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హోరో బచ్చాలనే కనిపిస్తాడునువ్వు బచ్చా అంటున్న నేను ఎన్నికల్లో ఒంటరిగా నిలబడి ధైర్యంగా పొరాడుతున్నా14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏం చేశాడో చెప్పుకోలేకపోతున్నాడుచంద్రబాబు పేరు చెబితే గుర్తు వచ్చే ఒక్కమంచి పథకం అయినా ఉందా?14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ప్రజలకు తాను చేసిన మేలు చెప్పి ఓట్లు ఎందుకు అడగలేకపోతున్నాడు?మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేాశా అని చెప్పే చంద్రబాబు పేదవాళ్లకు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా ఉందా?బచ్చా అంటున్న జగన్ను చూసి.. బాబు ఎందుకు బయపడుతున్నాడు?బచ్చాను ఎదుర్కొనేందుకు ఇన్ని పార్టీలతో పొత్తు ఎందుకు?చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?అమ్మ ఒడి, చేయూత, ఆసరా, సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, పెన్షన్ వంటి పథకాలు నువ్వు ఎందుకు చేయలేదు?ఐదేళ్లలో నేను అమలు చేసిన పథకాలనే అమలు చేస్తానని ఎందుకు చెబుతున్నావు?రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా?గత మేనిఫెస్టోలో చెప్పినవి 99 శాతం హామీలు అమలు చేశాంలంచాలు, వివక్ష లేకుండా రూ. 2 లక్షల 70 వేల కోట్లు అందించాంనాడు-నేడుతో విద్యా, వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చాం.31 లక్షల ఇళ్ల పట్టాలు,. 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఈ 58 నెలల కాలంలోనే జరిగింది.నా కేబినెట్లో 68శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు.58 నెలల్లోనే 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చాం200 స్థానాల్లో 100 టికెట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చాపేదల భవిష్యత్తు మరో రెండడుగులు ముందుకు వేసేలా 2024 మేనిఫెస్టో. -
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ పొన్నూరు (గుంటూరు జిల్లా)
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ పొన్నూరు (గుంటూరు జిల్లా) -
నన్ను కొట్టిన వాడి చేయి తీసేస్తా..
సాక్షి, గుంటూరు: ‘కొట్టడం అనేది ఎగైనెస్ట్ ది లా... పొరపాటున ఎవడైనా చేస్తే ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది. కొట్టినవాడి చెయ్యి తీసేస్తా.. ఎవడైతే చేశాడో.. ఏదో ఒకరోజు ఐదేళ్లకో, పదేళ్లకో, పదిహేనేళ్లకో.. వాడు ఎంత చేస్తే అంతకు డబుల్ చేస్తా....’ ‘ఇదే అమెరికాలో అయితే కాల్చేస్తారు... ’ ‘వైఎస్సార్ సీపీ నాయకులు సద్దాం హుస్సేన్లా వ్యవహరిస్తున్నారు. సద్దాం హుస్సేన్ కూడా తన ఇష్టారీతిగా వ్యవహరించినందునే బంకర్లో దాగి ఉన్నా లాక్కొచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి చంపారు.’పై వ్యాఖ్యలు ఎవరో రౌడీనో, గుండానో, చదువుకోని వ్యక్తో చేసినవి కాదు. డాక్టర్ చదివి అమెరికాలో వ్యాపారాలు చేసి గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ పలు సందర్భాలలో చేసినవి. రెండు రోజుల క్రితం ఒక పచ్చ మీడియా అధినేతతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక వేళ మీపై కేసులు పెడితే, కొడితే ఏం చేస్తారు అని ప్రశి్నస్తే తనను కొట్టడం చట్టానికి విరుద్దం అని చెబుతూనే తనను కొట్టిన వారిని మాత్రం చెయ్యి తీసేస్తానంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం గమనార్హం. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగిన చంద్రశేఖర్ మొదటి నుంచి డబ్బుందన్న అహంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. చంద్రశేఖర్ అనాలోచితంగా చేస్తున్న వ్యాఖ్యలు పారీ్టకి చేటు తెస్తున్నాయని వారు అంటున్నారు.ఇప్పటికే ఆయన తీరుపై కాపు సామాజిక వర్గం నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఆయన గుంటూరు బరిలోకి దిగిన తర్వాత ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క కాపు వర్గం నేతకు కూడా సీటు దక్కలేదు. అయినా పార్టీ కోసం పనిచేయడానికి వెళ్లిన వారికి ఛీత్కారాలే ఎదురయ్యాయి. తమ పారీ్టతో పాటు మిత్రపక్షాలలో ఉన్న కాపు నేతలు కూడా కూటమికి గుడ్బై చెప్పి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ ఇంటలెక్చువల్ సెల్ స్టేట్ కో–కనీ్వనర్ డాక్టర్ టి.వి.రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు పార్టీని వీడారు. మరికొంత మంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో రూ.వందల కోట్లు సంపాదించి గుంటూరులో రాజకీయం చేయాలని డిసైడైన చంద్రశేఖర్ కనీసం నియోజకవర్గానికి ఏం చేస్తాడో కూడా చెప్పడం లేదు. తాను గెలిచిన తర్వాత అభివృద్ధి చేసి చూపిస్తానని చెబుతున్నాడు. 2014, 2019 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ టిక్కెట్ కోసం ప్రయత్నించిన చంద్రశేఖర్, అనుకోని పరిస్థితుల్లో 2024లో గుంటూరు పార్లమెంట్ నుంచి బరిలోకి దిగారు. గెలిస్తేనే ఇక్కడ ఉంటారని, ఓడిపోతే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతారని తెలుగుదేశం నేతలు అభిప్రాయపడుతున్నారు. 2014, 2019లో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన గల్లా జయదేవ్ను గెలిపిస్తే నియోజకవర్గానికి సేవ చేయకపోగా చివరి నాలుగు సంవత్సరాలు అసలు కనపడకుండా పోయాడు.వరసగా రెండుసార్లు గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించినా గల్లా ప్రజలకు చేసిందేమి లేదనే చెప్పాలి. మొదటిసారి 2014లో ఇంటికో ఉద్యోగం వచ్చేలా చేస్తానని, 2019లో తన పరిశ్రమలను గుంటూరు చుట్టుపక్కల స్థాపించి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీలు గుప్పించారు. హామీలు అమలు చేయకపోగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకున్నారు. తన వద్ద డబ్బు ఉంది కాబట్టి డబ్బు కుమ్మరించి గెలవగలననే ధీమా పెమ్మసాని వ్యక్తం చేస్తున్నారు. తనకు భారీ మెజారిటీ వస్తుందంటూ ప్రగల్భాలు పలుకుతుండటం, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుండటంతో అసలుకే ఎసరు వస్తుందన్న భయం తెలుగుదేశం నేతల్లో కనపడుతోంది. -
టీడీపీ గూండాలు అరెస్ట్
టీడీపీ గూండాలు అరెస్ట్ -
కృష్ణా తీరం.. పోటెత్తిన జనప్రవాహం
(మేమంతా సిద్ధం బస్సుయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ఆకాశం నిప్పులు చిమ్మినా.. మేఘాలకు చిల్లులు పడినా.. నీపై మా అభిమానం తగ్గదు అన్నా.. నింగి, నేల ఉన్నంతకాలం నీతోనే మేమంతా జగనన్నా.. అంటూ సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గుంటూరు ప్రజల ఘాటైన ప్రేమాభిమానాలను గుండెల నిండా నింపుకుని.. ఎన్టీఆర్ జిల్లా వాసుల ఆప్యాయతలను పంచుకోవడానికి సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర శనివారం ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ రెండు జిల్లాలనూ కలిపే కనకదుర్గ వారధి జన ప్రవాహంతో పోటెత్తింది. అడుగుతీసి అడుగువేయలేనంతగా ప్రజలతో నిండిపోయింది. గుండెల్లో నింపుకున్న గుంటూరు.. గుంటూరు జిల్లా నంబూరు బైపాస్లో రాత్రి బస వద్ద మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పుతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు జగన్ను కలిశారు. పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ సీఎం జగన్ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఉ.10.13 గంటలకు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభమైంది. జననేత రాక కోసం అప్పటికే జాతీయ రహదారి అభిమానులతో నిండిపోయింది. రహదారికి రెండువైపులా జగన్ రాకకోసం ప్రజలు ఉత్సాహంతో ఎదురుచూశారు. అల్లంత దూరాన సీఎం జగన్ బస్సును చూడగానే ఒక్కసారిగా పరుగు పరుగున ఎదురెళ్లారు. జగనన్నా.. అంటూ బిగ్గరగా నినదిస్తూ.. చేతులు ఊపుతున్న అభిమానులను చూసి జగన్ ప్రతిగా అభివాదం చేశారు. దారిపొడవునా తనకు ఎదురొస్తున్న జన ప్రవాహానికి అభివాదం చేస్తూ.. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జగన్ బస్సుయాత్ర ముందుకు సాగింది. కంతేరు అడ్డరోడ్డులో అక్కడి గ్రామస్తులు జగన్కు గజమాలతో స్వాగతం పలికారు. ఆ తర్వాత చినకాకాని వద్ద మహిళలు వైఎస్సార్సీపీ జెండాలతో ఎదురొచ్చారు. వారిని చిరునవ్వుతో పలకరించి కాజా టోల్ప్లాజా వద్దకు వచ్చేసరికి ఆ ప్రాంతమంతా అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. స్థానికులు భారీ గజమాలతో జగన్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వారిచ్చిన ఆప్యాయతను అందుకుని ఎన్ఆర్ఐ సర్కిల్ మీదుగా మంగళగిరి చేరుకున్నారు. హైవేపై బారులు తీరిన జనం జగన్కు జేజేలు పలికారు. వారికి అభివాదం చేస్తూ సీకే కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్న సీఎం అక్కడ చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనకదుర్గ వారధిపై జనప్రవాహం.. ఇక గుంటూరు జిల్లా నుంచి జగన్ బస్సుయాత్ర వస్తోందని తెలిసి ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, పార్టీ అభిమానులు జగన్కు స్వాగతం పలికేందుకు కనకదుర్గ వారధిపైకి భారీగా తరలివచ్చారు. వర్షంలోనే గుంటూరు జిల్లా ఘనంగా వీడ్కోలు పలుకగా, ఎన్టీఆర్ జిల్లా ఆత్మీయంగా స్వాగతం చెప్పింది. దుర్గమ్మ నీడలో.. కృష్ణమ్మ సాక్షిగా.. కనకదుర్గ వారధి జనప్రవాహంతో నిండిపోయింది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఇదే వారధిపై పాదయాత్ర చేసిన రోజులను ఈ సందర్భంగా అభిమానులు గుర్తుచేసుకున్నారు. విజయవాడ వైఎస్సార్సీపీ నేతలు వెంటరాగా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సా.5.38 గంటలకు వారధి దాటింది. విజయవాడలో జనజాతర.. నగర చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా అభిమాన నాయకుడి ఆగమనంతో విజయవాడ నగరం జన జాతరను తలపించింది. మహిళలు, చిన్నారుల కోలాటాలు, స్టిక్ వాకర్స్, డప్పులు, వాయిద్యాలు, బటర్ఫ్లై వేషధారణలు, శక్తి వేషాలు, కేరళ సంప్రదాయ నృత్యాలు, బాణాసంచా కాంతులు, డీజే సౌండ్లు, భారీ గజమాలలు, జగన్ నిలువెత్తు కటౌట్లు.. ఇలా ఒకటేమిటి.. దారిపొడవునా కోలాహలం కనిపించింది. వారధి దాటిన దగ్గర్నుంచీ అభిమానులు పోటెత్తడంతో బస్సుయాత్ర ముందుకు కదలడమే కష్టమైంది. అడుగడుగునా పూలవర్షం కురిపించారు. భవనాలన్నీ జనంతో నిండిపోయాయి. కృష్ణలంక సాయిబాబా గుడి నుంచి ప్రతిదారీ ప్రజాభిమానంతో కిక్కిరిసిపోయింది. యాత్ర బందరు రోడ్డు రమేష్ ఆస్పత్రి సెంటర్ నుంచి శిఖామణి సెంటర్కు చేరుకోగానే అత్యంత భారీ గజమాలతో అభిమానులు జగన్కు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మెట్రో సెంటర్, చుట్టుగుంట, రోకళ్లపాలెం, సత్యనారాయణపురం, సింగ్ నగర్ డాబాకోట్లు సెంటర్ వరకూ ఇసుకేస్తే రాలనంత జనం బస్సుయాత్ర వెంట నడిచారు. సింగ్నగర్ వంతెనపైకి చేరుకోగానే మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీశారు. ప్రజల మధ్య భారతమ్మ.. శనివారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం తాడేపల్లి జంక్షన్కు చేరుకున్న బస్సుయాత్రలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతమ్మ బస్సుయాత్రగా వస్తున్న సీఎం జగన్కు రోడ్డుపై నిలబడి అభివాదం చేశారు. ప్రజలు, అభిమానుల మధ్య తానూ ఓ సామాన్యురాలిగా చిరునవ్వుతో జగన్కు చేతులు ఊపారు. ప్రతిగా సీఎం జగన్ కూడా బస్సులో నుంచే భారతికి అభివాదం చేశారు. మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీసి, హారతులిచ్చారు. అనంతరం మణిపాల్ ఆసుపత్రి జంక్షన్కు భారీగా చేరుకున్న అభిమానులు మళ్లీ రా.. అన్నా అంటూ వీడ్కోలు పలికారు.
Related News by category
-
ఫేక్ వీడియోకున్న విలువ.. సీఎం జగన్ ప్రాణానికి లేదా?
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు పబ్లిక్గా ఏపీ సీఎం జగన్ను చంపుతా అంటున్నారని, ఎన్నికల వేళ ఫేక్ వీడియోల గురించి తీవ్రంగా స్పందిస్తున్నవాళ్లు.. ఇంత సీరియస్ ఇష్యూపై స్పందించకపోవడం బాధాకరమని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్, YSRCP నేత పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం ఉదయం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నో రోజులుగా సీఎం జగన్ను చంపేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ‘రేపే నిన్ను(సీఎం జగన్ను ఉద్దేశిస్తూ..) చంపితే ఏం చేస్తారు’ అని చంద్రబాబు అడుగుతున్నారు. విశాఖ ఎయిర్పోర్టులో దాడి జరిగితే మీరే చేపించుకున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. ఇది దుర్మార్గం కాదా?. దీనిపై ఎవరూ స్పందించరా?. ఒక ఫేక్ వీడియోకి ఉన్న విలువ సీఎం జగన్ ప్రాణానికి లేదా?.. సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఆర్థిక నేరస్తులు. ఈ విషయం అందరికీ తెలుసు. అసలు సుజనా చౌదరి బీజేపీలోకి ఎందుకు మారారు? బీజేపీలో ఉంటే వేల కోట్లు తినొచ్చా? అక్రమాలు చేసిన వాళ్లు బీజేపీలో ఉంటే శిక్ష పడదా?. మోదీగారు మీరు నిజాయితీవంతమైన నాయకులు. ఇలాంటి వారిని ప్రొత్సహించి మీ ఇమేజ్ను దెబ్బ తీసుకోకండి’’ అని పోసాని అన్నారు. -
చంద్రబాబు, పవన్కు పొలిటికల్ ట్విస్ట్.. బీజేపీ కీలక ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఎన్నికల వేళ కూటమిలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ, జనసేనకు బీజేపీ ఊహించని షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ కట్టుబడి ఉంటుందని.. తెలుగుదేశం, జససేన నిర్ణయాలకు అనుకూలంగా ఉండలేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది.ఇక, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే డీప్ ఫేక్ వీడియోల వ్యవహారం సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పార్టీ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ మరోసారి పునర్ఘటించింది. ఈ క్రమంలో ముస్లిం రిజర్వేషన్ల రద్దుకే కట్టుబడి ఉన్నామని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో.. టీడీపీ, జనసేన నిర్ణయాలకు తాము అనుకూలంగా లేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది. Truth: If BJP comes into power, we will make an end of the unconstitutional Muslim reservations. Meanwhile it's the right of SC, ST & OBC people of Telangana. We will ensure them that they get it. Therefore, We will end the Muslim Reservations.Fake Video: If BJP comes to power,… pic.twitter.com/4OxR8LP9Z9— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 30, 2024బాబును నమ్మని బీజేపీ ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడినప్పటికీ, ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు. చంద్రబాబు ఢిల్లీలోని తన ఏజెంట్లు, బీజేపీలో ఉన్న తన అనుంగులు, ఇతరత్రా పైరవీలు చేశారు. అయినా బీజేపీ పెద్దలు ఆయన్ని నమ్మలేదు. ఢిల్లీలో రాత్రింబవళ్లు పడిగాపులు గాసి, కాళ్లా వేళ్లా పడి చిట్టచివరకు పొత్తు పెట్టుకోగలిగారు. బీజేపీ పొత్తయితే పెట్టుకొంది కానీ, చంద్రబాబును ఆ పార్టీ పెద్దలు నమ్మడంలేదన్న విషయం ప్రతి సందర్భంలోనూ బయటపడుతోంది. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపే అసాధ్యమైతే, మేనిఫెస్టో విషయంలోనూ మరోసారి అభాసుపాలు కాకూడదని బీజేపీ అధిష్ఠానం భావించింది. దీంతో ఈసారి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఓ పరిశీలకుడిని మాత్రమే పంపి మమ అనిపించింది. కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరుకాలేదు.అంతేకాదు.. మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫొటోగానీ, కమలం గుర్తు గానీ ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే, చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ, ఇతర నాయకుల ఫొటోలు లేకుండా, కమలం గుర్తును మాత్రం వేయించారు. బీజేపీ దీనికీ అంగీకరించలేదు. దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకుడు సిద్ధార్థనాథ్సింగ్ పట్టుబట్టారు. దీంతో మేనిఫెస్టో ముఖచిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేశారు. -
కృష్ణమ్మ తీరం విజయహారం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రగతి పరుగులు పెడుతోంది. విజయవాడను సుందరంగా తీర్చిదిద్దడంతో కృష్ణా నదీతీరం, దుర్గ గుడి, ప్రకాశం బ్యారేజీలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంబేడ్కర్ స్మృతివనం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. మరోవైపు మెగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, జగనన్న కాలనీలు, ప్రభుత్వ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మూలపాడు వద్ద బటర్ఫ్లై పార్కును అందంగా తీర్చిదిద్ది 150 రకాల ఔషధ మొక్కలు పెంచుతున్నారు. కొండపల్లి బొమ్మల పరిశ్రమ అంతరించిపోకుండా వాటి తయారీదారులకు చేయూతనిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బందరులో అత్యధిక జనాభా ఆధారపడి పనిచేసే రోల్డ్గోల్డ్ పరిశ్రమకు ప్రోత్సాహం కలి్పస్తున్నారు. అక్కడి ప్రజల చిరకాల కోరిక పోర్టు నిర్మాణం కల నెరవేరనుంది. గిలకలదిండిలో మత్స్యకారులకు ఉపాధి కలి్పంచేందుకు హార్బర్ నిర్మాణం పూర్తి కావస్తోంది. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయి 150 మంది విద్యార్థులతో తరగతులు జరుగుతున్నాయి. రుద్రవరంలో కృష్ణా యూనివర్సిటీ భవనాలు నిర్మాణం పూర్తి చేసుకొని కార్యకలాపాలు జరుగుతున్నాయి. విశాఖ బీచ్ తరహాలో ఆహ్లాదకరమైన వాతావరణం కలి్పంచేందుకు బందరు బీచ్లో రిసార్ట్స్, పార్కులు, గేమ్ జోన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.రహదారులు.. అదరహో ⇒విజయవాడ బెంజిసర్కిల్ జంట ఫ్లై ఓవర్లు అందుబాటులోకి ⇒కృష్ణా నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి కావడంతో తప్పిన ముంపు సమస్య ⇒వెస్ట్ బైపాస్ పనులు వేగంగా సాగుతున్నాయి తూర్పు బైపాస్ ప్రతిపాదనలకు తుది రూపు⇒జాతీయ రహదారి మొత్తం 17,761 మీటర్ల పొడవున 18 రహదారుల డివైడర్లను హరిత హారాలుగా తీర్చిదిద్దారు. ⇒నగరంలో 16 పార్కులను అభివృద్ధి చేశారు. ఎయిర్పోర్టు కారిడార్కు రూ.17 కోట్లతో తుదిరూపు ⇒మిషన్ క్లీన్ కృష్ణా కింద నదీ తీరాన్ని శుభ్రం చేశారు. నగరంలోని ప్రధాన కాలువల్లో బోటింగ్కు సన్నాహాలు ⇒కనకదుర్గా నగర్ గోశాల వద్ద రూ.216.05 కోట్లతో వివిధ పనులకు శంకుస్థాపన, రూ.23.145 కోట్లతో పూర్తి చేసిన పనులు ప్రారంభం ⇒ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో రూ.102 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు రూ.62 కోట్లతో మున్నేరు కాల్వలఆధునికీకరణ పనులు ⇒ విజయవాడలో కాలువలపై రూ.31 కోట్లతో ఏడు బ్రిడ్జిల నిర్మాణం ⇒ జిల్లాలో తొలి విడతలో 1.07 లక్షల మందికి ఇళ్లు మంజూరు.. ⇒ వాటిలో 14,935 ఇళ్ల నిర్మాణం పూర్తి ⇒ కాల్వ గట్టు, ప్రభుత్వ స్థలాలు, రోడ్ల పక్కన నివాసం ఉండే వారిని తొలగించి వాంబే కాలనీలో ఇళ్లు కేటాయింపు ⇒ పటేల్నగర్, ప్రకాష్నగర్, వడ్డెరకాలనీ, నందావరి కండ్రిక ప్రాంతాల్లో గతంలో 13,915 ఇళ్లు నిర్మించి కొన్నింటినే రిజి్రస్టేషన్ చేశారు ⇒ జలజీవన్ మిషన్ కింద 77,123 గృహాలకు నీరు అందించేందుకు రూ.77.9 కోట్లు ఖర్చు చేశారు అంబేడ్కర్ స్మృతివనం అద్భుతం⇒ నగరాభివృద్ధికి చేసిన ఖర్చు – రూ.1,383 కోట్లు ⇒అంబేడ్కర్ స్మృతివనం కోసం చేసిన ఖర్చు– రూ.400 కోట్లు ⇒ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులు– రూ.239.19 కోట్లు ⇒ జీజీహెచ్లో నాడు–నేడు ద్వారా అభివృద్ధి పనులకు– రూ.170 కోట్లు ⇒ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణం కోసం – రూ.150 కోట్లు ⇒ కృష్ణా నది రక్షణ గోడ నిర్మాణం కోసం చేసిన ఖర్చు – రూ.394.27 కోట్లు ⇒బెంజి సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ పొడవు– 2.27 కి.మీ ⇒ దాని నిర్మాణానికి చేసిన ఖర్చు– రూ.80 కోట్లు ⇒ బెంజి సర్కిల్ రెండవ ఫ్లైఓవర్ పొడవు – 1.703 కి.మీ ⇒ దాని నిర్మాణానికి చేసిన ఖర్చు – రూ.96 కోట్లు ⇒బెంజిసర్కిల్ వెస్ట్, ఈస్ట్ సైడ్ సరీ్వస్ రోడ్లకు ఖర్చు చేస్తున్న మొత్తం : రూ.40 కోట్లు ⇒ గన్నవరం విమానాశ్రయం హాఫ్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం చేసిన ఖర్చు –రూ.23.75 కోట్లు ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యసేవలు విజయవాడ జీజీహెచ్లో కార్డియోథోరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పిడియాట్రిక్ సర్జరీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిరి్మంచారు. అత్యాధునిక క్యాథ్ల్యాబ్, ఎంఆర్ఐ స్కాన్, 120 స్లైస్ సీటీ స్కాన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకోసం వైఎస్ జగన్ సీఎం కాగానే రూ.30 కోట్లు విడుదల చేశారు. రూ.170 కోట్లతో నాడు–నేడు పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలకు రూ.437 కోట్లు ఖర్చు చేశారు. జిల్లాలోని ఏ కొండూరు మండలంలోని గిరిజన తండాల్లో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగుల కోసం రూ.40 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ఏ కొండూరు పీహెచ్సీలోనే డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి నెలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అర్హులైన వారికి రూ.10 వేల పింఛన్ ఇస్తున్నారు. పురోగతిలో బెజవాడ బైపాస్ పనులు ప్యాకేజీ–3 చిన్న అవుటుపల్లి –గొల్లపూడి పొడవు: 30 కి.మీ ⇒ దీనికోసం ఖర్చు చేస్తున్న మొత్తం: రూ.1,148 కోట్లు ప్యాకేజీ–4 ⇒ గొల్లపూడి–చినకాకాని – 17.88 కి..మీ ⇒ కృష్ణా నదిపై ఆరువరుసల బ్రిడ్జి పొడవు– 3.12 కి.మీ ⇒ దీనికోసం ఖర్చు చేస్తున్న మొత్తం రూ.757 కోట్లు ⇒ ఈస్ట్ బైపాస్ ప్రతిపాదనలు ⇒ బైపాస్ పొడవు: 49.3 కి.మీ ⇒ కృష్ణా నదిపై నిర్మించే బ్రిడ్జి పొడవు – 3.750 కి.మీ ⇒ అంచనా వ్యయం మొత్తం –రూ.4,607.80 కోట్లు -
వైఎస్ జగన్... ఆ పేరే ఓ స్ఫూర్తి...
సాక్షి, అమరావతి: ‘పేదలు ఎదగాలంటే ప్రభుత్వ సాయం కావాలి. అందుకు సంక్షేమ పథకాలు చాలా వరకూ తోడ్పడతాయి. ఒక వైపు సంక్షేమం... మరోవైపు అభివృద్ధి ఏపీలో సమపాళ్లలో జరుగుతోంది. అందుకు కారకుడైన జగన్ అంటే అందుకే నాకు ప్రత్యేకమైన అభిమానం’ అంటున్నారు సినీ నటుడు రాజా రవీంద్ర. వ్యక్తిగతంగా తనకే కాదు చాలా మందికి ఆయన ఇన్స్పిరేషన్ అంటూ కొనియాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన పట్ల తన అభిప్రాయాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..పేదలు ఎదగాలంటే...ప్రభుత్వ ఆసరా కావాలి.. పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలు ఎదగాలంటే మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతికి చేరాలంటే అది వారి కాయకష్టం మీద అయ్యేపని కాదు. కాబట్టి తప్పకుండా సంక్షేమ పథకాలు అవసరమవుతాయి. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలు రూపాల్లో ఆసరా అందిస్తోంది.అన్నివర్గాల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలంటే వారికి ప్రభుత్వం తప్పనిసరిగా అందివ్వాల్సింది విద్య, వైద్యం. ఈ విషయంలో చాలా మార్పులు జరిగాయి.దళారీలు లేకుండా చేరుతున్న లబ్ధి సంక్షేమ పథకాల అమలు విషయంలో గ్రామ వలంటీర్ల విధానం చాలా మంచి కాన్సెప్్ట. వీరి వల్ల మధ్యలో ఎవరికీ ఎటువంటి లంచాలు, పైరవీలతో తావు లేకుండా పేదలకు పథకాలు అందుతున్నాయి. ఈ వ్యవస్థ ఎంత గొప్పదో... ప్రయోజనాలు పొందుతున్నవారికి బాగా అర్థమవుతుంది. ఈ సంక్షేమ పథకాలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా అమలు చేయడం గొప్ప విషయం. అధికారంలోకి రావడం కోసం పొత్తుల కన్నా ఒంటరిపోరుకే జగన్ సై అంటారు. ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆయన మీద అభిమానం చెక్కు చెదరలేదు. ఈ ఎన్నికల్లో జగన్ విజయం తథ్యం. ఖరీదైన వైద్యానికీ సర్కారు సాయం ప్రస్తుతం రోగాలు వస్తే దానికి వైద్యం ఎంత ఖరీదైపోయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏ రోగం వచ్చిన లక్షలకు లక్షలు మంచినీళ్లలా ఖర్చుచేయాల్సి వస్తోంది. ఒక కిడ్నీ పాడైనా చికిత్సకు రూ.20 లక్షలపైనే ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో అనుకోని వ్యాధి వస్తే ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఎలా తట్టుకోగలవు? ఇక నిరుపేదల సంగతైతే వేరే చెప్పనక్కర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం వారిని ఎంతగానో ఆదుకుంటోంది. ఇప్పుడు వైద్య పరిమితిని రూ.25లక్షలకు పెంచారు. ఇది నిజంగా ఎక్స్ట్రార్డినరీ స్టెప్. విద్యతోనే విజయం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలల్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. కొన్ని తరగతుల విద్యార్థులకు ట్యాబ్స్ అందిస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇది ఒక సమగ్ర విద్యావికాస మార్గంగా చెప్పాలి. వీటన్నింటివల్లా పాఠశాలల్లో చదివే వారిలో కనీసం 10శాతం మంది వృద్ధిలోకి వచ్చే అవకాశం కచి్చతంగా ఉంటుంది. అలా వచ్చిన వారు రూ.లక్షల్లో జీతాలు తెచ్చుకోగలుగుతారు. అప్పుడు తప్పకుండా పేదల జీవన ప్రమాణాల స్థాయి మారిపోతుంది. నిజంగా జరగాల్సింది అదే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది. -
ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
వీరిని చూస్తే రంగులు మార్చే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. నేను అప్పుడప్పుడూ రంగులు మార్చితే వీళ్లు ఎన్నికలొచ్చినప్పుడల్లా కండువాలు మార్చేస్తున్నారే..? అంటూ ఒంటికాలిపై లేస్తోంది. పిలిచి టిక్కెట్లిచ్చి.. ఎన్నికల్లో గెలిపించుకున్న తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని మండిపడుతోంది. ప్రజాసేవను పక్కనబెట్టి స్వార్థ రాజకీయాల కోసం పరితపిస్తున్నారని విరుచుకుపడుతోంది.. అయితే.. వారి ప్రత్యర్థులను చూస్తే జాలేస్తోందని.. వారు సౌమ్యులు.. ప్రజాసేవకులని చెప్పుకొస్తోంది. అసలు జిల్లాలో అలాంటి వారు ఎవరు..? వారి కథా కమామిషు ఏంటో మీరే చదవండి..! సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జంపింగ్ జపాంగ్లంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఒకరు వెలగపల్లి వరప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం. ఈ ముగ్గురూ ఊసరవెల్లికి మించి రంగులు మారుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరు చొక్కాలు మార్చినంత ఈజీగా, పార్టీలు, కండువాలు మార్చే నాయకులని చర్చించుకుంటున్నారు. ప్రజాసేవకంటే సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పారీ్టలు మారుతుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో పారీ్టల కండువాలు మార్చడం అలవాటుగా మార్చుకున్నారని చర్చించుకుంటున్నారు. అయితే వీరి ఎంత స్వార్థపరులో ప్రస్తుతం బరిలో ఉన్న వీరి ప్రత్యర్థులు అంత సౌమ్యులని చెప్పుకుంటున్నారు. దోపిడీకి ఆయనే ‘మూలం’ సత్యవేడు టీడీపీ అభ్యర్థి ఆదిమూలం స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తారనే ప్రచారం ఉంది. ఆదిమూలం మొదట కాంగ్రెస్, ఆ తరువాత టీడీపీలో చేరారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కున చేర్చుకుని సత్యవేడు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిపారు. ఒకసారి ఓటమి పాలైనా.. రెండో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ ఆయన ప్రజలకు సేవ చేయడంలో విఫలమయ్యారు. ఇసుక, మట్టి అమ్ముకునేవారు. పరిశ్రమల నుంచి మామూళ్లు వసూళ్లు చేసేవారు. ఏదైనా సమస్యపై ఎమ్మెల్యే ఆదిమూలం వద్దకు వెళితే పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు బాధితులు చెబుతున్నారు. తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కుమారుడు సుమన్ చేయని అరాచకాలు లేవు. అధికారులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, విలేకరులపైన దౌర్జన్యాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆదిమూలానికి వైఎస్సార్సీపీ టికెట్ నిరాకరించింది. ఛీత్కారాలే ప్రజలకు ‘వర’ం తిరుపతి పార్లమెంట్ కూటమి అభ్యర్థి వరప్రసాద్ ఎదుటి వాళ్లను తిట్టడం, సొంత వాళ్లను ఆకాశానికి ఎత్తడం ఆయన నైజం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని 2014లో తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత గూడూరు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన పనితీరు బాగాలేక పోవడంతో టికెట్ ఇవ్వలేదు. పదవుల రుచి మరిగిన ఆయన గారికి ఇప్పుడు దళిత జాతి ఆత్మగౌరవం గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది. దళితుల్ని జగన్ అణచివేస్తున్నారనే ఆయన గారి విమర్శలు విన్న జనానికి దెయ్యాలువేదాలు వల్లించినట్లుందని చెప్పుకుంటున్నారు. అధికారం కోసం ఆయన మొదట ప్రజారాజ్యం, ఆ తరువాత వైఎస్సార్సీపీ, ఇప్పుడు బీజేపీలో చేరారు. టీడీపీ, జనసేన వద్దంటే బీజేపీ కండువా కప్పుకుని కూటమి అభ్యర్థి అయ్యారు. ఇతను పదవి కోసం తప్ప ప్రజలతో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుంటారు. గతంలో ఆయన తిరుపతి ఎంపీగా కొనసాగినప్పటికీ,ప్రజానీకంతో సంబంధం లేకుండా, అలంకారప్రాయంగా ఉన్నారు. ఎవరైనా సమస్యతో వరప్రసాద్ దగ్గరికెళితే ఛీత్కరించుకున్న ఘటనలు బోలెడు. వరప్రసాద్ ఎంపీ, ఎమ్మెల్యే అయ్యారంటే కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలువే.రౌడీయిజం..ఆరణి నైజం తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్నటి వరకు చిత్తూరు జిల్లా కేంద్రం. అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా.. ఆయన అస్సలు పట్టించుకోలేదు. తమ సమస్యలపై వెళితే ఎంత ఇస్తావ్..? అని అడిగిన సందర్భాలేన్నో ఉన్నాయని బాధితులు చెబుతుంటారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని భూములు ఆక్రమించుకోవడం, అభివృద్ధి పనుల్లో పర్సెంటేజ్లు, అధికారుల నుంచి మామూళ్లు, నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటు పొడవడం, రౌడీయిజం ఆరణి నైజం. ఆయన మొదట టీడీపీలో ఉంటూ.. టికెట్ ఇవ్వకపోతే ప్రజారాజ్యంలో చేరి చిత్తూరు అభ్యరి్థగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మరళా టీడీపీలో చేరారు. అప్పుడూ టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని ఎమ్మెల్యే అయిన ఆరణి స్వార్థ రాజకీయం కోసం జనసేనలో చేరి ప్రశాంతతకు మారుపేరైన తిరుపతిలో అలజడులు సృష్టిస్తున్నారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదింపులు
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
- పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
Advertisement