ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేయడం లేదన్నా | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేయడం లేదన్నా

Published Fri, Apr 13 2018 6:54 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

‘అన్నా.. ఆరోగ్యశ్రీ ద్వారా రెండో సారి ఆపరేషన్‌ చేయమంటున్నారు. నా కాలు, చేయి పనిచేయడం లేదు’ అంటూ దోర్నాల తిరుపతిరెడ్డి జననేత ఎదుట వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా  మహానాడు రోడ్డులో జననేతను కలసి సమస్య విన్నవించుకున్నారు. కొన్నేళ్ల కిందట మెడ చుట్టూ పెద్దపెద్ద గడ్డలు రావడంతో ఆస్పత్రికి వెళ్లా. దోమపోటుతో వచ్చాయంటూ ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేసి తొలగించారు. ఏడాదిలోపులో మళ్లీ ఆపరేషన్‌ చేయాలన్నారు. అదే సమయంలో మహానేత వైఎస్‌ మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆస్పత్రికి వెళితే ఆరోగ్యశ్రీ ద్వారా రెండోసారి ఆపరేషన్‌కు అవకాశం లేదన్నారు. అప్పటి నుంచి డబ్బులు లేక ఆపరేషన్‌ చేయించుకోలేదు. రెండో సారి ఆపరేషన్‌ చేయకపోవడం వల్ల కుడివైపు కాలు, చెయ్యి చచ్చుబడిపోయాయి. పింఛన్‌ కూడా రావడం లేదు. తల్లి కూడా చనిపోయింది. ముఠాపని చేసే తండ్రి సంపాదన  పైనే ఆధారపడి బతుకుతున్నా. నన్ను ఆదుకోండన్నా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement