పురుగు మందుల ధరలను నియంత్రించాలి | Sakshi
Sakshi News home page

పురుగు మందుల ధరలను నియంత్రించాలి

Published Wed, Apr 18 2018 6:58 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

కృష్ణా జిల్లా :‘టీడీపీ పాలనలో వ్యవసాయం భారంగా మారింది. ఎరువులు, పురుగుమందుల ధరలు అమాంతం పెంచేశారు’ అని రైతు మూరకొండ నాగ భాస్కరరావు మంగళవారం ముత్యాలంపాడు వద్ద ప్రజాసంకల్పయాత్రలో జననేత జగన్‌ను కలిసి రైతుల సమస్యలు వివరించారు. పురుగు మందుల ధరలు ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటున్నాయని, వీటి ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని వినతిపత్రం అందజేశారు. డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు రూ. 800 నుంచి రూ. 1200లకు పెరిగాయని తెలిపారు. ఎరువులతో పాటుగా పురుగు మందుల ధరలపై కూడా సబ్సిడీ ఇచ్చి రైతులకు అండగా నిలవాలని ఆయన జననేతను కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement