ప్రసవం కోసం వెళ్తే ప్రాణాలు తీశారయ్యా.. | Sakshi
Sakshi News home page

ప్రసవం కోసం వెళ్తే ప్రాణాలు తీశారయ్యా..

Published Sun, May 13 2018 7:00 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

కృష్ణాజిల్లా  :‘రెండో కాన్పులో పురిటినొప్పులతో ప్రసవం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లితే అక్కడి వైద్యులునిర్లక్ష్యంగా శస్త్ర చికిత్స చేసి మా అమ్మాయి చిట్టెమ్మ ప్రాణాలు తీశారు’ అంటూ చింతలమోడు గ్రామానికి చెందిన చాలంటి బేబీ సరోజిని జననేత ఎదుటకన్నీటి పర్యంతమయ్యారు. తల్లి మృతి చెందడం, తండ్రి పట్టించుకోక పోవడంతో ఇద్దరు పిల్లలుఅనాథలయ్యారని ప్రజా సంకల్ప యాత్రలో జగన్‌ను కలసి గోడువెళ్లబోసుకున్నారు. ప్రభుత్వ వైద్యులనిర్లక్ష్యం వలన కుమార్తె మృతి చెందిందని తాము నిరసన తెలపగా ప్రభుత్వం తరఫున చర్చలకు వచ్చిన గుడివాడ ఆర్డీఓ ఇద్దరు పిల్లలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement