జైనులు, మార్వాడీలకు గుర్తింపునివ్వాలి | Sakshi
Sakshi News home page

జైనులు, మార్వాడీలకు గుర్తింపునివ్వాలి

Published Thu, May 24 2018 7:04 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

పశ్చిమగోదావరి : తెలుగు రాష్ట్రాలకు ఉపాధి కోసం వచ్చిన జైనులు, మార్వాడీలు వేలాది సంఖ్యలో ఉన్నారని విజయవాడకు చెందిన మనోజ్‌ కొఠారి అర్థవరం వద్ద పాదయాత్రలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి చెప్పారు. మాకు ఎటువంటి రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడంతో మా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కష్టంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో మేమంతా మీ వెంటే ఉంటామని, మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే కనీసం నామినేట్‌డ్‌ పదవుల్లో ఒకదానిని మాకు కేటాయించాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement