అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదన్నా.. | Sakshi
Sakshi News home page

అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదన్నా..

Published Sat, May 26 2018 7:08 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

పశ్చిమగోదావరి :జగనన్నా మాకు అన్ని అర్హతలున్నా నేటీకీ రుణమాఫీ కాలేదన్నా. భూమి పట్ట దారు పాస్‌ పుస్తకాలు పట్టుకుని అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. నా లుగైదు సార్లు విజయవాడలోని రైతు సాధికారిత కార్యాలయానికి వెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేదు. అక్కడ అధికారులు మా గ్రామంలోని టీడీపీ, జన్మభూమి కమిటీ సభ్యులను కలిస్తే రుణమాఫీ అవుతుందని చెబుతున్నారని పెదకాపవరం గ్రామానికి చెందిన కఠారి కనకదుర్గ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పట్టదారు పాస్‌ పుస్తకం జిరాక్స్‌తో పాటు వినతిపత్రం అందజేశారు.

వైఎస్సార్‌ వల్లే నేను బతికాను- ఎం.కృష్ణమ్మ, రామయ్యగూడెం, చిన కాపవరం
దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్లే నేను ఈరోజు ఇలా ఉండగలిగాను. నాకు గుండె ఆపరేషన్‌ చేయాల్సి వస్తే ఎంతో డబ్బు ఖర్చు అవుతుందని మా కుటుంబ సభ్యులు ఆలోచిస్తుండగా ఆరోగ్య శ్రీ ఉంది కదా అని బంధువులు గుర్తుచేశారు. దీంతో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్‌ చేయించుకుని, ప్రాణాలు కాపాడుకున్నానని చిన కాపవరంలోని రామయ్యగూడెంకు చెందిన ఎం.కృష్ణమ్మ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement