ఉద్యోగ భద్రత కోసం వినతి | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత కోసం వినతి

Published Wed, Dec 13 2017 7:46 AM

People Sharing There Sorrows To Ys Jagan - Sakshi

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని క్షయ నివారణ విభాగం(ఆర్‌ఎన్‌టీసీపీ) ఉద్యోగులు వైఎస్‌ జగన్‌ను కలిశారు. కాంట్రాక్ట్‌ పారా మెడికల్‌ ఉద్యోగులుగా ల్యాబ్‌ టెక్నిషియన్లు, టీబీహెచ్‌వీ ఎస్‌టీఎన్, ఎస్‌టీఎల్‌ఎస్, టీబీ హెచ్‌ఐవీ సూపర్‌వైజర్లు, డాటా ఎంట్రీ అపరేటర్లు, స్టేట్‌ ఐఈసీ ఆఫీసర్లు, స్టేట్‌ అకౌంట్‌ంట్‌ ఆఫీసర్లు, స్టాటిస్టికల్‌ అసిస్టెంట్లు, డ్రైవర్లుగా రాష్ట్ర వ్యాపంగా 538 మంది పని చేస్తున్నామని అందులో వివరించారు. పన్నెండేళ్ల నుంచి పని చేస్తున్నా ఇంతవరకు రెగ్యులర్‌ చేయలేదని జగన్‌తో మొరపెట్టుకున్నారు. మీ పార్టీ అధికారంలోకి వస్తే ‘మాకు ఉద్యోగ భద్రత కల్పించండి’ అంటూ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జిల్లా కమిటీ సభ్యులు శశిధర్, రవికుమార్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, మహేశ్‌ కోరారు. 

Advertisement
Advertisement