కంచికచర్ల : ప్రభుత్వం మారితే సకాలంలో అధికారులు సామాజిక పింఛన్లు ఇవ్వరా అంటూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక పోస్టాఫీస్ వద్ద బుధవారం పింఛన్ల కోసం పడిగాపులు పడుతున్నారు. పట్టణంలో 1732 మంది పింఛనుదారులున్నారు.పోస్టాఫీస్ వద్ద రోజుకు 100 మందికి మాత్రమే అందజేస్తున్నారు. కేవలం ఒకే మిషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఐరిస్ సక్రమంగా పడడం లేదని, ఎక్కువమందికి పంపిణీ చేయలేకపోతున్నారు. నెలలో 15రోజులు గడిచినా పింఛన్లు పంపిణీ చేయట్లేదని వృద్ధులు ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆధార్ కార్డు నంబర్లు లేవని కొన్ని రోజులు, ఐరీస్ పడడం లేదని మరికొన్ని రోజులు, వేలిముద్రలు పడడం లేదని నెల రోజుల వరకు తంతితపాలా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. పింఛను డబ్బులు వస్తాయని రోజూ ఆటోలకు రూ 20 నుంచి రూ. 30ల వరకు ఖర్చు అవుతుందని సకాలంలో భోజనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు వృద్దులు, వికలాంగులు ఆరోపిస్తున్నారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్నా అధికారులు తమ గోడును పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు.
డబ్బులు పెరిగినా ప్రయోజనం లేదు
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పింఛన్ డబ్బులు పెంచారు కాని ఆధార్కార్డు లేదని, మిషన్ సక్రమంగా పనిచేయట్లేదని, ఐరిస్ పడడం లేదని, వేలిముద్రలు సరిగ్గా రావట్లేదని కుంటి సాకులు చెప్పి నెలంతా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని వృద్ధులు ఆరోపిస్తున్నారు. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో రూ.200 పింఛను డబ్బులిచ్చినా ఐదు రోజుల లోపు ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం పింఛను కోసం రోజుల తరబడి తిరగాల్సి రావడంతో ఆటోలకు, రిక్షాలకు రోజూ రూ20 నుంచి రూ.30 వరకు ఖర్చు అవుతుందని వాపోతున్నారు.
ఆధార్కార్డు, రేషన్ కార్డు జిరాక్సుల ఖర్చులతో పాటు, తమతో పాటు వచ్చు వారికి మధ్యాహ్నం టిఫిన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. పింఛను డబ్బుల్లో రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చు అవుతుందని మిగిలేది ఆ రెండు వందలు మాత్రమేనని అంటున్నారు. అధికారులు సకాలంలో పింఛన్లు మంజూరు చేయాలని పలువురు వితంతువులు, వృద్ధులు, వికలాంగులు కోరుతున్నారు.
పింఛన్ల కోసం పండుటాకుల పడిగాపులు
Published Thu, Apr 16 2015 3:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement