సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అప్రకటిత విద్యుత్ కోతలు.. మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వారం రోజులుగా 42 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో విద్యుత్ సరఫరా ఉండకపోవడంతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు.
= ప్రాజెక్టులో తగినంత నీరు లేకపోవడంతో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది.
= మరోవైపు నాణ్యమైన బొగ్గు దొరకకపోవడంతో బొగ్గుతో పనిచేసే థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు.
= కృష్ణా జిల్లాలోని ఎన్టీటీపీఎస్(నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్)లో సుమారు ఐదు వందల మెగావాట్ల విద్యుత్ తక్కువగా ఉత్పత్తి అవుతోంది. ఇదే పరిస్థితి రామగుండం, కొత్తగూడెం విద్యుత్ కేంద్రాల్లో ఉండగా ముద్దనూరు విద్యుత్ కేంద్రం పూర్తిగా మూతపడింది. విద్యుత్ ఉత్పత్తి తగ్గి వినియోగం పెరగడంతో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ విధిస్తున్నట్టు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎపీఎస్పీడీసీఎల్) అధికారులు చెబుతున్నారు.
= ఒంగోలు నగరంలో కూడా అప్రకటిత విద్యుత్ కోత అమలవుతోంది. నాలుగు రోజులుగా వేళాపాళా లేకుండా సరఫరా నిలిపివేస్తున్నారు. రోజుకు కనీసం నాలుగైదు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. జిల్లా కేంద్రం ఒంగోలులోనూ ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం.
= జిల్లాలోని మున్సిపాలిటీల్లో కూడా లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు విధిస్తున్నారు.
= నైరుతీ రుతుపవనాలు వచ్చి వాతావరణం చల్లబడే వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
= కర్ణాటక, మహారాష్ట్రల్లో వర్షాలు పడి శ్రీశైలం జలాశయానికి నీరు వ చ్చి జల విద్యుత్ ఉత్పత్తి పెరిగితే అప్పుడు విద్యుత్ కోతలు తగ్గించే అవకాశం ఉంది.
జలవిద్యుత్ నిలిచిపోవడం వల్లే : జయకుమార్, ఎస్ఈ, ట్రాన్స్కో
రాష్ట్ర వ్యాప్తంగా జల విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీనికి తోడు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడం విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. జిల్లాకు 390 మిలియన్ యూనిట్లు కావాల్సి ఉండగా 340 మిలియన్ యూనిట్ల వరకే సరఫరా అవుతోంది. ఉత్పత్తికి మించి వినియోగం పెరగడం వల్ల గ్రిడ్కు సాంకేతిక లోపం తలెత్తకుండా ఉండేందుకు అత్యవసరంగా విద్యుత్ లోడ్ రిలీఫ్ ఇవ్వాల్సి వస్తోంది.
విద్యుత్ కోతలతో ఇబ్బంది : కె.ప్రసాద్, వ్యాపారి, పామూరు
వేలకు వేలు వెచ్చించి కోత మిషన్, ఫినిషింగ్ యంత్రాలు తెచ్చి పెట్టుకున్నా విద్యుత్ కోతలతో ఉపయోగం లేకుండా పోతోంది. దుకాణంలో ఇద్దరికి జీతాలు ఇవ్వాలి. పగటి వేళ, ముఖ్యంగా పని సమయాల్లో కోతల పేరుతో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నా.
కంప్యూటర్ సెంటర్ నిర్వహించడం కష్టంగా ఉంది : పశుపులేటి నారాయణ, పామూరు
విద్యుత్ కోతలతో కంప్యూటర్ సెంటర్ నిర్వహించడం కష్టంగా ఉంది. ఇన్వర్టర్ ఉన్నా దాని ప్రభావం కొద్ది గంటలే. కంప్యూటర్ నేర్చుకోవాలన్న విద్యార్థుల ఆశలపై విద్యుత్ కోతలు నీళ్లు చల్లుతున్నాయి. వేల రూపాయల బాడుగలు చెల్లించి నెట్ సెంటర్లు నిర్వహించడం నిరుద్యోగ యువతకు కత్తిమీద సాములా మారింది.
ఉక్కిరి బిక్కిరి
Published Sat, Jun 14 2014 2:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement