లారీ ఢీకొని వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Published Thu, Sep 3 2015 8:23 AM

person died in a road accident

నెల్లూరు(చిల్లకూరు): చిల్లకూరు మండలం తిక్కవరం సమీపంలోని గిరిజన కాలనీ వద్ద తుపాకుల చిన సుబ్రహ్మణ్యం(40) అనే వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement