సెల్ఫీ తీసుకుంటూ కానరాని లోకానికి.. | Sakshi
Sakshi News home page

సెల్ఫీ తీసుకుంటూ కానరాని లోకానికి..

Published Wed, Mar 22 2017 8:03 PM

సెల్ఫీ తీసుకుంటూ కానరాని లోకానికి.. - Sakshi

విశాఖపట్టణం: సముద్రం ఒడ్డున సెల్ఫీ తీసుకుంటూ ఒక విద్యార్థిని అలల ధాటికి మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. విశాఖలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మధురవాడకు చెందిన కె.అమృత(17), డీఎం కల్యాణ్‌(18), అనిల్‌, రాజేష్‌ అనే విద్యార్థులు జోడుగుళ్లపాలెం బీచ్‌కు వచ్చారు. వారంతా ఒక రాయిపై నిలబడి సెల్ఫీ తీసుకుంటుండగా అకస్మాత్తుగా వచ్చిన అలలు వారిని గట్టిగా తాకాయి. దీంతో అమృత, కల్యాణ్‌లు సముద్రంలోకి పడిపోయారు.  అమృత మృతదేహాన్ని పోలీసులు ఒడ్డుకు చేర్చారు. కల్యాణ్‌ జాడ కోసం జాలర్లు, నేవీ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement