వాహన యజమానులపై మళ్లీ పెట్రో పోటు
జిల్లా వాసులపు నెలకు రూ.34.60 కోట్ల అదనపు భారం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. నిన్న మొన్నటివరకు ధరలను పైసల్లో తగ్గిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా రూపాయల్లో పెంచేసింది. పెట్రోల్పై లీటరుకు రూ.3.07, డీజిల్పై రూ.1.90 పెంపుదల చేస్తూ.. పెరిగిన ధరలు బుధవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. తాజాగా పెంచిన ధరలకు వ్యాట్ ట్యాక్స్ కలిపితే పెట్రోల్ ధర రూ.3.52, డీజిల్ ధర రూ.2.12 చొప్పున పెరుగుతుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో పెట్రోల్ ధర రూ.62.12 పైసలు, డీజిల్ రూ.52.28 పైసలుగా ఉంది. తాజా పెంపు ధరతో బుధవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో పెట్రోలు ధర రూ.65.64, డీజిల్ ధర రూ.54.40 పైసలు అవుతుందని ఏలూరులోని ఓ పెట్రోలు బంకు యజమాని సీతారామాంజనేయులు చెప్పారు.
రూ.34.60 కోట్ల భారం
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో జిల్లాపై నెలకు రూ.34.60 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. జిల్లా వ్యాప్తంగా హెచ్పీసీ, బీపీసీ, ఐఓసీ, ఇతర ఆయిల్ కంపెనీలకు సంబంధించి 400 వరకు బంక్లు ఉన్నాయి. సగటున ఒక్కో బంక్లో రోజుకు పెట్రోల్ 3 వేల లీటర్లు, డీజిల్ 8వేల లీటర్లు విక్రయిస్తుంటారని అంచనా. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా సుమారు 12 లక్షల లీటర్ల పెట్రోల్, 32 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. ధరల పెరుగుదల వల్ల పెట్రోల్ వినియోగదారులపై రోజుకు సుమారు రూ.47.64 లక్షలు, నెలకు రూ.14.29 కోట్ల మేర అదనపు భారం పడనుంది. డీజిల్ వినియోగదారులపై రోజుకు సుమారు రూ.67.84 లక్షలు, నెలకు రూ.20.35 కోట్ల మేర ఆర్థిక భారం పడుతుందని మార్కెట్ వర్గాల అంచనా. రవాణా శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 8,870 లారీలు, ట్రక్ ఆటోలు 12,415, స్కూల్ బస్లు 1,832, ట్రాక్టర్లు 5,450, 42 వేల ఆటోలు ఉన్నాయి. వీటికితోడు చేపలు, రొయ్యల సాగుకు సంబంధించి చెరువులకు, మోటార్ పంపుసెట్లుకు డీజిల్ అవసరం.
ఆర్టీసీపైనా భారం
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా రంగంతోపాటు ఏపీ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)పైనా అదనపు భారం తప్పటం లేదు. జిల్లాలో 673 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటికి రోజుకు 35 వేల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. జిల్లాలో ఆర్టీసీపైనే రోజుకు సుమారు రూ.81 వేల ఆర్థిక భారం పడుతుంది. నెలకు రూ.24.36 లక్షల భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి ఇది అదనపు భారంగా పరిణమించనుంది.
బండి బాదుడు
Published Thu, Mar 17 2016 12:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement