కోచింగ్‌కు డబ్బుల్లేక పీజీ విద్యార్థి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

కోచింగ్‌కు డబ్బుల్లేక పీజీ విద్యార్థి ఆత్మహత్య

Published Thu, Mar 5 2015 2:03 AM

కోచింగ్‌కు డబ్బుల్లేక పీజీ విద్యార్థి ఆత్మహత్య

లేపాక్షి: బ్యాంకు పరీక్షల కోచింగ్‌కు వెళ్లేందుకు డబ్బుల్లేక పీజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా లేపాక్షి మండలం శిరివరం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. మృతుడి తండ్రి కథనం ప్రకారం... రామచంద్రప్ప కుమారుడు రఘువర్దన్(23) ఎంకామ్ చ దివాడు. బ్యాంకు ఉద్యోగం కోసం మూడు సార్లు పరీక్షలు రాశారు. కోచింగ్ లేకపోవడం వల్లే ఉద్యోగం రావడంలేదని ఇంట్లో చెప్పేవాడు. పేద కుటుంబం కావడం, ఇటీవల తల్లి చనిపోవడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో కర్నూలులో బ్యాంకు పరీక్ష రాసి మంగళవారం రాత్రి ఇంటికి వచ్చాడు. అందరూ నిద్రపోతున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రామచంద్రప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Advertisement
Advertisement