హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ప్రమేయం ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కు ఏసీబీ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఏ క్షణంలో అయినా ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద దశలవారీగా విచారణకు రావాలని నోటీసులు ఇవ్వనుంది.
ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పార్టీ నేత వరదరాజులరెడ్డి బుధవారం ఉదయం సీఎం రమేష్ నివాసానికి వెళ్లారు. సీఎం రమేష్తో వీరు ఇరువురు భేటీ అయ్యారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్రెడ్డిని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు కలిశారు.