'పోలవరం ప్రాజెక్టు అంధ్రప్రదేశ్కు గుండెకాయ' | Sakshi
Sakshi News home page

'పోలవరం ప్రాజెక్టు అంధ్రప్రదేశ్కు గుండెకాయ'

Published Fri, Jun 13 2014 10:52 AM

'పోలవరం ప్రాజెక్టు అంధ్రప్రదేశ్కు గుండెకాయ' - Sakshi

పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కు గుండెకాయవంటిదని ఆ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా అభివర్ణించారు. శుక్రవారం విశాఖపట్నంలో దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. పోలవరం ముంపు ఆర్డినెన్స్పై రాజకీయం చేయడం తగదని ఆయన టీఆర్ఎస్కు హితవు పలికారు.

 

పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. వెనకబడిన జిల్లాల అభివృద్దికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 15న పులిచింతల ప్రాజెక్టు పనులు పరిశీలిస్తామన్నారు. అయితే ఆ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే జాతికి  అంకితం చేయడం విడ్డూరంగా ఉందని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement