- ముంపు మండలాల ‘విలీనం’ కష్టాలు
- భూసేకరణ విభాగంలోని 200 మంది
- ఉద్యోగులకు విడుదల కాని జీతాలు
కుకునూరు : ఆంధ్రప్రదేశ్లో విలీనమైన పాల్వంచ, భద్రాచలం డివిజన్లలోని పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో పనిచేస్తున్న రెవెన్యూ శాఖ భూసేకరణ విభాగంలోని ఉద్యోగులకు జూన్ నెల జీతాలు విడుదల కాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 200 మంది ఉద్యోగులు, సిబ్బందికి చెల్లించాల్సిన జీతాలు రూ.8 లక్షలు పెండింగ్లో పడ్డాయి. ఈ ఉద్యోగుల జీతాల బిల్లులు ఇంకా ఆన్లైన్ కాకపోవడమే ఇందుకు కారణమని ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచ, భద్రాచలం డివిజన్లు కేంద్రాలుగా భూసేకరణ విభాగంలో రాజీవ్సాగర్ ఎత్తిపోతల పథకం (దుమ్ముగూడెం) కింద ఒక యూనిట్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు (పోలవరం) కింద నాలుగు యూనిట్లు పనిచేస్తున్నాయి.
వీటిలో దుమ్ముగూడెం ప్రాజెక్టు పరిధి ముంపు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో లేకపోవడంతో ఆ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఉద్యోగులకు జూన్ నెల జీతాలు ఆన్లైన్ కావడంతో వారికి చెల్లించారు. అయితే పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో చేర్చడంలో భూసేకరణ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆంధ్రాలోకి వచ్చారు. ముంపు మండలాల పరిధిలో ఆ శాఖ కింద నలుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల(ఎస్డీసీ)తోపాటు 200 మంది రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. జూన్ నెలకు సంబంధించి జీతాల చెల్లింపు నిలిచిపోయింది.
ఆర్డినెన్స్ విడుదలే కారణం : కేంద్ర ప్రభుత్వం ముంపు మండలాలకు సంబంధించిన ఆర్డినెన్స్ను విడుదల చేయడంతో ఈ సమస్య వచ్చింది. ముంపు మండలాలకు చెందిన సిబ్బందికి జీతాలు ఇంతవరకు ఆన్లైన్ చేయలేదు. వారికి సంబంధించి హెడ్ఆఫ్ అకౌంట్ సైతం ఆన్లైన్లో లేకపోవడం గమనార్హం. ఈ విషయమై గురువారం కుకునూరుకు వచ్చిన ఆర్డీఎల్ఎస్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ బీఎస్.నారాయణరెడ్డిని వివరణ కోరగా ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ విడుదలైనందున ఆ శాఖలు, వారి జీతాలను కూడా తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం సర్కిల్కు కలిపారని తెలిపారు.
‘పోలవరం’ సిబ్బందికి జీతాల్లేవ్
Published Sun, Jun 29 2014 2:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement