సీల్ వేయకుండానే పరీక్షలకు.. | Sakshi
Sakshi News home page

సీల్ వేయకుండానే పరీక్షలకు..

Published Fri, Dec 11 2015 3:13 AM

police Negligence cought in alcohol Adulterated case

* కల్తీ మద్యం కేసులో పోలీసుల నిర్లక్ష్యం  
* ఏపీ సీఎం బాబు ఆగ్రహం  
సాక్షి, హైదరాబాద్: విజయవాడ స్వర్ణ బార్‌లో ఐదుగురి మరణానికి కారణమైన మద్యం శాంపిళ్లను ఆహారభద్రతా విభాగానికి (ఎఫ్‌ఎస్‌ఎల్) పంపడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీటికి సీల్ వేయకుండానే ఎఫ్‌ఎస్‌ఎల్‌కు తరలించగా తీసుకొనేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. దీంతో పోలీసులు మళ్లీ సీల్ వేసి, ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అందజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన సమీక్షలో ఈ విషయం బహిర్గతమైంది. ఈ నిర్లక్ష్యంపై బాబు తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తుంటే మీ (పోలీసులు) వైఫల్యం వల్ల జాప్యం జరుగుతోందని చంద్రబాబు మండిపడ్డారు.

Advertisement
Advertisement