కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి | Sakshi
Sakshi News home page

కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి

Published Wed, Mar 23 2016 5:07 PM

police ridings on hen fighting centre in west godavari district

చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందేల స్థావరంపై  బుధవారం పోలీసులు మెరుపు దాడి చేశారు. చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామంలో కోడిపందెం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 10 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.66 వేల నగదు, 2 కార్లు, 4 బైక్‌లు, 2 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ సైదా నాయక్ తెలిపారు.

Advertisement
Advertisement