పార్వతీపురం: ఓటుకు నోటు కార్యక్రమానికి పాల్పడిన టీడీపీ నేతల దురాగతానికి నిరసనగా సోమవారం వైఎస్ఆర్సీపీ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, మజ్జి వెంకటేష్, చుక్క లక్ష్ముంనాయుడు, చింతల జగన్నాథం తదితరుల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే స్థానిక పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
సీఐ వి. చంద్రశేఖర్, ఎస్ఐ వి.అశోక్కుమార్ తదితరుల ఆధ్వర్యంలో పోలీసులు ఒక్కసారిగా వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలపై విరుచుకుపడి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి విఘాతం కలిగించారు. దీనిపై వైఎస్ఆర్ సీపీ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తే ఇలా చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మంత్రి రవి, ఎస్. శ్రీనివాసరావు, కవ్వాటి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి
రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఓటుకు నోటు కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ అన్నారు. సోమవారం ఆయన పార్టీ నాయకులు మజ్జి వెంకటేష్, చింతల జగన్నాథం, మంత్రి రవి, చుక్క లక్ష్ముంనాయుడు తదితరులతో కలసి ఆర్డీఓ ఆర్.గోవిందరావును కలిశారు. ఈ సందర్భంగా వారు ఆర్డీఓతో మాట్లాడుతూ అవినీతి నిరోధకశాఖ విడుదల చేసిన వీడియో క్లిప్ంగుల లో సాక్షాత్తు రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో ముడుపులు ఇస్తున్నట్లు రేవంత్రెడ్డి తెలిపిన విషయాన్ని ప్రజలంతా మీడియాలో చూశారన్నారు.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగావున్న వ్యక్తి అవినీతికి ప్రోత్సహించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఎన్నికల కమిషన్, రాష్ట్ర గవర్నర్ కలుగజేసుకొని టీడీపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరారు. అనంతరం ఆర్డీఓ గోవిందరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్. రాజారావు, బి. కృష్ణ, ఎస్. శ్రీనివాసరావు, కవాటి రాంబాబు, నర్సంనాయుడు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ సీపీ ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
Published Mon, Jun 1 2015 11:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement