రేపే అసెంబ్లీ కమిటీ హాల్ 1లో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 16 ఏళ్ల అనంతరం రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. 1998లో రాష్ట్రంలో ఆరు స్థానాలకు ఏడుగురు పోటీపడటంతో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత జరిగిన రాజ్యసభ ఎన్నికలన్నీ ఏకగ్రీవమయ్యాయి. మళ్లీ ఈసారి పోలింగ్ జరుగుతోంది. ఈసారి కూడా ఆరు స్థానాలకు ఏడుగురు రంగంలో ఉండటంతో పోలింగ్ అనివార్యమైంది. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్ నె ంబర్ 1లో పోలింగ్ జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటారని అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి డాక్టర్ రాజసదారాం తెలిపారు.
అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, అది పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో శాసన సభ్యుల సంఖ్య 294. ఆంగ్లో ఇండియన్ కోటా కింద నియమితులయ్యే ఎమ్మెల్యేకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు లేదు. ప్రస్తుతం అసెంబ్లీలో 15 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా ఎమ్మెల్యేల్లో సుమన్ రాథోడ్ (టీడీపీ), జనార్దన్ థాట్రాజ్ (కాంగ్రెస్), సీహెచ్ రమేష్ (టీఆర్ఎస్)లకు కోర్టు ఆదేశాలతో ఓటు హక్కు లేదు. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో 276 మంది ఎమ్మెల్యేలు ఓటువేయనున్నారు.
రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్, టి.సుబ్బరామిరెడ్డి, టీడీపీ నుంచి గరికపాటి మోహన్రావు, సీతారామలక్ష్మి, టీఆర్ఎస్ నుంచి కె.కేశవరావులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి కూడా బరిలో ఉన్నారు. 2003 ప్రజాప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణను అనుసరించి రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. అభ్యర్థులను నిలబెట్టిన ప్రతి పార్టీ తరఫున పోలింగ్ బూత్లో ఒక ఏజెంటు ఉంటారు. ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తున్నారో తమ పార్టీ ఏజెంటుకు తప్పనిసరిగా చూపించాలి. లేనిపక్షంలో ఆ ఓటు పోల్ కాదు. ఈసారి అసెంబ్లీ సమావేశం లేకపోవడంతో ఎమ్మెల్యేలు కేవలం ఓటు వేసి వెళ్లనున్నారు.
ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి: ఆదాల ప్రభాకర్రెడ్డి
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ ఎన్నికల్లో సమైక్యానికి ఓటువేయడం ద్వారా ఎమ్మెల్యేలు తమ గళాన్ని గట్టిగా వినిపించాలని అన్నారు.
రాజ్యసభ స్థానాలకు.. 16 ఏళ్ల తరువాత పోలింగ్
Published Thu, Feb 6 2014 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement