► భారీగా స్టాల్స్ అద్దెలు... సౌకర్యాలు నిల్
► కానరాని ఇంటర్నేషనల్ సంస్థలు
► కేవలం ఐదు రాష్ట్రాల నుంచే ఎగ్జిబిటర్ల రాక
విజయవాడ: లయోలా కళాశాలలో ఏర్పాటైన ఉద్యానవన ఎగ్జిబిషన్లో స్టాల్స్ అద్దెలు ఎక్కడా లేనంత భారీగా వసూలు చేశారు. మూడు రోజులు నిర్వహించిన ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయటంలో నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారు. దాంతో ప్రభుత్వం ఆర్బాటంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఉద్యానవన ఉత్పత్తుల మామిడి ప్రదర్శన పేలవంగా కొనసాగింది. సీఎం చంద్రబాబు ఈ ఎగ్జిబిషన్ను సోమవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం నాడు 300 మంది మాత్రమే హాజరయ్యారు. మంగళవారం సందర్శకులు నామమాత్రంగానే వచ్చారు. ఎగ్జిబిషన్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ అయిన (సీఐఐ) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్కి అప్పగించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది.
స్టాల్స్ నిర్వాహకులకు సీఐఐ సరైన ఏర్పాట్లు చేయలేకపోయింది. భారీగా అద్దెలు మాత్రం వసూలు చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. ఏసీ స్టాల్స్కు రూ.45వేలు అద్దె వసూలు చేశారు. దాదాపు 150 ఏసీ స్టాల్స్ ద్వారా రూ.65.50 లక్షల అద్దె వసూలు చేశారు. అదే విధంగా సాధారణ స్టాల్స్ 50 ఏర్పాటు చేశారు. వీటికి ఒక్కొకదానికి రూ.20వేల చొప్పున అద్దె వసూలు చేశారు. మొదటి రోజు ఏసీ స్టాల్స్లో ఏసీలు పని చేయలేదు. స్టాల్స్ యజమానులకు, సిబ్బందికి భోజన వసతి, లావెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో స్టాల్స్ నిర్వాహకులు, సందర్శకులు, రైతులు నానా అగచాట్లు పడ్డారు. హైదరాబాద్ హైటెక్లో జరిగే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో విజయవాడ కంటే తక్కువగా స్టాల్కు రూ.30వేల మాత్ర మే అద్దె వసూలు చేసేవారని వివిధ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. బెంగళూరులో జరిగే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో కూడా స్టాల్కు రూ.32 వేలు అద్దె తీసుకున్నారని, ఇక్కడ భారీగా వ సూలు చేశారని వాపోయారు.
మహా రాష్ట్ర, ఢిల్లీ, హార్యానా, గుజరాత్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వ్యవసాయ పరికరాలు తయారు చేసే కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. వీటిలో అధికంగా మన రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు. డ్రిప్ ఇరిగేషన్, రెయిన్గన్స్, ప్లాస్టిక్ షీట్స్, పాలీహౌస్ తదితరాలు తయారు చేసే కంపెనీలు తమ వస్తువులను ప్రదర్శించాయి. అంతర్జాతీయ స్థాయిలో కంపెనీల సామగ్రి రాకపోవటంతో రైతులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొరియా, జపాన్, తైవాన్, చైనా తదితర దేశాల కంపెనీల వస్తువులు ఇక్కడ ప్రదర్శిస్తే బాగుండేదని రైతులు పేర్కొన్నారు.
ఆర్గానిక్ పంటలపై దృష్టి సారించండి
గుణదల : ఉద్యాన పంటలు పడించే రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా మెరుగైన దిగుబడులు సాధించడంతోపాటు ఆరోగ్యవంతమైన పంటలను అందించిన వారవుతారని రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. బుధవారం మామిడి ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులు నూతన విధానాలను అందిపుచ్చుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లో ఫుడ్ ఫ్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని మరింత వృద్ధిలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని, దేశంలోనే ఉద్యాన పంటల సాగులో బొప్పాయి, మిరప, ఆయిల్ ఫామ్ మొదటి స్థానంలో ఉన్నాయని, మామిడి, టమాట పంటలు రెండో స్థానంలో ఉన్నాయని, అన్ని రకాల ఉద్యాన పంటల్లో దేశంలో మొదటి స్థానం సాధించటానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మామిడి మేళాలో ప్రదరించిన రైతులకు అవార్డు, సర్టిఫికెట్, రూ.5 వేల నగదు బహుమతులను అందించారు.
పేలవంగా హార్టీకల్చర్ షో
Published Thu, May 26 2016 12:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement