బామనపాడు పోర్టుకు మా భూములివ్వం | Sakshi
Sakshi News home page

బామనపాడు పోర్టుకు మా భూములివ్వం

Published Sun, Sep 6 2015 2:08 PM

porata committe committee formed for bamanapadu port

వజ్రపుకొత్తూరు(శ్రీకాకుళం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో నిర్మించాలని చూస్తున్న బామనపాడు పోర్టుకు వ్యతిరేకంగా పలు గ్రామాల రైతులు రోడ్డెక్కారు. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన పది గ్రామాల రైతులు ఈ రోజు సమావేశమయ్యారు. అనంతరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టేందుకు పోరాట కమిటీని ఎన్నుకున్నారు. మండలంలో పోర్టు నిర్మాణానికి 10వేల ఏకారలు సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement