తెలుగు యూనివర్సిటీని రాజమండ్రికి తరలిస్తాం | Sakshi
Sakshi News home page

తెలుగు యూనివర్సిటీని రాజమండ్రికి తరలిస్తాం

Published Thu, Apr 9 2015 6:06 PM

potti sree ramulu telugu university shifted to rajamundry says muralimohan

రాజమండ్రి కల్చరల్ : హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమండ్రికి  తరలించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఎంపీ మురళీమోహన్ హామీ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులోని తెలుగు సాహిత్యపీఠంలో పద్మభూషణ్, కళాప్రపూర్ణ బోయి భీమన్న పద్య, గేయ సాహిత్యం పై రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చిన మురళీమోహన్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మానసపుత్రిక అయిన ఈ విశ్వవిద్యాలయం తరలింపు విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి, పుష్కరాలలోగా ప్రభుత్వ ప్రకటన వెలువడేందుకు కృషి చేస్తామన్నారు.

Advertisement
Advertisement