విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం! | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం!

Published Thu, Feb 5 2015 7:11 PM

విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం!

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమయ్యింది.  తాజాగా విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) కి డిస్కంలు ప్రతిపాదనలను అందజేయడంతో ఛార్జీల పెంపు అనివార్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిస్కంలు అందజేసిన ప్రతిపాదనలపై ఈనెల్లో ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ప్రభుత్వానికి ఈఆర్సీ సిఫార్సు చేయనుంది. ఏప్రిల్ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

ఈఆర్సీకి డిస్కం అందజేసిన ప్రతిపాదనలు..

50 లోపు యూనిట్లకు రూ. 2.75

51 నుంచి 100 లోపు యూనిట్లకు రూ.3.45

101 నుంచి 150 యూనిట్ల వరకూ రూ.5.71


151 నుంచి 200 వరకూ రూ.6.71

201 నుంచి 250 వరకూ రూ. 6.76,

251 నుంచి  300 వరకూ రూ.7.29

301 నుంచి 400 వరకూ రూ. 7.82 ,

401 నుంచి 500 వరకూ  8.35

500 పై బడిన యూనిట్లకు రూ.8.88

Advertisement

తప్పక చదవండి

Advertisement