రాజమండ్రి :‘రాష్ట్రంలో ఇక విద్యుత్ కోతలుండవు.. వారానికి ఏడు రోజులూ.. 24 గంటలూ (24/7) విద్యుత్ సరఫరా జరుగుతుంది’ అని ప్రభుత్వ పెద్దలు, అధికారులు చేసిన ప్రకటనలన్నీ వట్టి ‘కోతలు’గా తేలిపోయాయి. కొరత, సాంకేతిక సమస్యల పేరుతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోజుకు నాలుగైదుసార్లు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఒక్కోసారి రెండు గంటలపాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా రాత్రిపూట విద్యుత్ కోత సర్వసాధారణంగా మారింది. రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. పగటిపూట కూడా ఇదే పరిస్థితి నెలకొంది. విద్యుత్ ఉత్పత్తి పడిపోవడమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు చెబుతున్నారు. జిల్లాకు రావాల్సిన విద్యుత్లో రోజుకు 2 వేల మెగావాట్లు కొరత ఉంటోంది. దీంతో రాత్రి వేళల్లో లోడ్ రిలీఫ్ ప్రకటించాల్సి వస్తోందని అంటున్నారు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల మార్పు, కొత్త లైన్లు వేయడం, ఎవరైనా వినియోగదారుని సర్వీసు నిలిచిపోతే మరమ్మతులు చేయడంవంటి పనులు కూడా దీనికి తోడవుతున్నాయి. మండు వేసవిలోనే విద్యుత్ సరఫరా బాగుందని, వర్షాకాలం మొదలైన తరువాత కోతలేమిటని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ ‘కోతలే’..
Published Sun, Sep 6 2015 1:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement