రాష్ర్టంలో మళ్లీ విద్యుత్ కోతలు | Sakshi
Sakshi News home page

రాష్ర్టంలో మళ్లీ విద్యుత్ కోతలు

Published Wed, Sep 4 2013 2:08 AM

Power cuts in state, one hour power cut in Hyderabad

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. ఇటీవలి కాలంలో ఎండలు తీవ్రమవడం, వర్షాల్లేక జల విద్యుతుత్పత్తి తగిపోయిన నేపథ్యంలో విద్యుత్ సరఫరా కన్నా డిమాండ్ అధికమైంది. దీంతో విద్యుత్ కోతలు అమలుచేయాలని ఏపీ ట్రాన్స్‌కో నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నుంచే విద్యుత్ కోతలను అమలు చేయాలని డిస్కంలకు ట్రాన్స్‌కో అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను అనుసరించి.. హైదరాబాద్ నగరంలో రోజుకు గంట, జిల్లా కేంద్రాల్లో రెండు, మున్సిపాలిటీల్లో నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరాను నిలిపి వేయనున్నారు. ఇక మండల కేంద్రాల్లో అయితే ఏకంగా ఆరు గంటలపాటు, గ్రామాల్లో ఎనిమిది నుంచి 12 గంటలపాటు కోతలు అమల్లోకి రానున్నాయి.

Advertisement
Advertisement