20వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

20వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Published Tue, Nov 28 2017 8:57 AM

PrajaSankalpaYatra 20th Day Kick Starts - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, ఎమ్మిగనూరు : ప్రజాసంకల్పయాత్ర 20వ రోజును ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం పుట్టపాశం నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు.

అక్కడ నుంచి హెచ్‌ కిరవడి, గాజులదిన్నె క్రాస్‌ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభం అవుతుంది. గోనెగొండ్లలో పార్టీ జెండా ఆవిష్కరించి, బహిరంగ సభ నిర్వహిస్తారు. రాత్రికి వైఎస్ జగన్‌ గోనెగండ్లలోనే బస చేస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement