కడప నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సోమవారం నుంచి ప్రారంభం కానున్న ప్రజా సంకల్పం పాదయాత్రలో ప్రజలు ఇచ్చే సలహాలు, సూచనలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటాయని, వారి ఆకాంక్షలకు అనుగుణంగానే దీనిని తీర్చిదిద్దుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ఆదివారం ‘జగన్ స్పీక్స్’ అనే కార్యక్రమాన్ని ఫేస్బుక్తో అనుసంధానిస్తూ ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ప్రతిరోజూ పాదయాత్రలో తన రోజువారీ అనుభవాలను నెటిజన్లతో పంచుకుంటానని వెల్లడించారు.
ఇకపై జగన్ మాట్లాడే వీడియోల పరంపర ఫేస్బుక్లో అందుబాటులో ఉంటుంది. ఫేస్బుక్లో విడుదల చేసిన తొలి వీడియోలో జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘తెలుగు ప్రజలకు నమస్కారం.. ఇది వరకు ప్రకటించిన విధంగా ప్రజా సంకల్ప యాత్రను నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాను. వైఎస్సార్ కుటుంబం ద్వారా మీరు నా కుటుంబంలో ఒక్కటయ్యారు. భాగమయ్యారు. మీరు నన్ను నమ్మి నాతో ప్రయాణం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 7 నెలలపాటు దాదాపు 3 వేల కిలోమీటర్లకు పైగా సాగే ఈ పాదయాత్రతో మీకు మరింత దగ్గరగా అయ్యే ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పే ప్రతి అంశాన్నీ వింటాను. మీ కష్టాలను, నష్టాలను పరిష్కరించే ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేస్తాను.
నవరత్నాలను గతంలోనే మీతో పంచుకున్నాను. ఆ నవరత్నాలను కూడా మెరుగు పరచడానికి మీరేదైనా సలహా ఇస్తే తీసుకుంటూ అడుగులు ముందుకు వేస్తాను. మనం ఎన్నికల సమయానికి విడుదల చేసే మేనిఫెస్టో ఆఫీసుల్లో కూర్చొని దిద్దిన మేనిఫెస్టోలా కాకుండా ప్రజలు దిద్దిన మేనిఫెస్టోలా బయటకు రావాలి. నా పాదయాత్ర ద్వారా నేను చేసే ప్రయత్నమిదే. ఆ దిశగా మీ సలహాలు, మీరు చెప్పే అంశాలతో, మీరు చేసే మార్పులతోనే ఆ మేనిఫెస్టో విడుదల చేయాలన్న తాపత్రయంతోనే నా పాదయాత్ర సాగుతుంది. ఈ నేపథ్యంలో డిజిటల్ మీడియా ద్వారా మీ అందరితో ఇంకా దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ ఈ పాదయాత్రలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నా’’ అని పేర్కొన్నారు. ‘జగన్ స్పీక్స్ వీడియో సిరీస్ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉంటా.. ఈ కార్యక్రమానికి సంబంధించి మీతో మమేకం(కనెక్ట్) కావడానికి విడుదల చేసిన తొలి వీడియోను ఫేస్బుక్లో ఉంచుతున్నాను’ అని వైఎస్ జగన్ ట్విటర్లో ట్వీట్ చేశారు.
ప్రజల సలహాలే పార్టీ మేనిఫెస్టో
Published Sun, Nov 5 2017 8:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement