గర్భిణీపై గ్యాంగ్ రేప్: నిందితుల్లో మైనర్లు | Sakshi
Sakshi News home page

గర్భిణీపై గ్యాంగ్ రేప్: నిందితుల్లో మైనర్లు

Published Sun, May 3 2015 8:59 AM

గర్భిణీపై గ్యాంగ్ రేప్: నిందితుల్లో మైనర్లు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెదపాడులో శనివారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. గర్భిణీపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారైయ్యారు. దాంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మైనర్ యువకులు ఉన్నారని బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే అత్యాచార ఘటన్ని నిందితులు వీడియో తీశారని బాధితురాలు ఆరోపించింది.

Advertisement
Advertisement