సాక్షి, గుంటూరు
ఓ యువకుడు ప్రేమిస్తున్నానంటూ నాలుగేళ్లుగా ఓ విద్యార్థిని వెంట పడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తన వెంట పడవద్దని ఎన్నోసార్లు ఆ యువతి చేతులెత్తి వేడుకున్నా ఆ శాడిస్టు మనసు మాత్రం కరగలేదు. బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే రాజకీయ పలుకుబడితో కేసు నమోదు కాకుండా బైండోవర్తో బయటపడగలిగాడు. అప్పటి నుంచి వేధింపులు ఎక్కువకావడంతో భరించలేని బాధిత యువతి సోమవారం రూరల్ జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణను ఆశ్రయించింది. తన గోడు చెప్పుకుని కాపాడమని వేడుకుంది. వివరాలిలా ఉన్నాయి.. వినుకొండకు చెందిన ఓ యువతి నరసరావుపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతోంది. మొదటి సంవత్సరం నుంచి శావల్యాపురం మండలం పిచుకలపాలెం గ్రామానికి చెందిన బోడేపూడి నాగేశ్వరరావు అనే యువకుడు తనను ప్రేమించమంటూ వెంటపడి వేధించడం ప్రారంభించాడు. అనేకసార్లు తన జోలికి రావద్దని చెప్పినప్పటికీ వేధింపులు మానకపోవడంతో వినుకొండ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. రాజకీయ పలుకుబడి ఉన్న నాగేశ్వరరావు పెద్దమనషుల సమక్షంలో పోలీసుస్టేషన్లో పంచాయితీ పెట్టి బైండోవర్ సంతకంతో బయటపడ్డాడు. నెలరోజులపాటు ఆమె వైపు రాకుండా ఉన్న నాగేశ్వరరావు ఆ తరువాత మళ్లీ వేధించడం ప్రారంభించాడు. కళాశాల వద్దకు వెళ్లి బహిరంగంగానే వేధిస్తుండడంతో తట్టుకోలేని బాధితురాలు ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతూ మధ్యలోనే ఆపివేసి ఇంటికే పరిమితమైంది. అయినా ఆగని నాగేశ్వరరావు ప్రతిరోజూ ఆమె ఇంటి వద్దకు వెళ్లి తనను పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ పోసి చంపుతానని అడ్డు వస్తే కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తానంటూ బెదిరించడం ప్రారంభించాడు. ఇక ఆ శాడిస్టు వేధింపులు భరించలేని బాధితురాలు రూరల్ ఎస్పీ రామకృష్ణను కలిసి తనను, తన కుటుంబాన్ని కాపాడాలంటూ భోరున విలపించింది. న్యాయం జరగకపోతే తమ కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని వాపోయింది. బాధితురాలి గోడు విన్న ఎస్పీ స్పందించారు. యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశాలు జారీచేశారు.
ప్రేమించకుంటే యాసిడ్ పోస్తా
Published Tue, Sep 30 2014 12:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement