ఇంకా టెండర్ల దశలోనే పలు పనులు
చాలావరకూ మరమ్మతులతో సరి!
రామచంద్రపురం నియోజకవర్గంలో ఘాట్ల పరిస్థితి
రామచంద్రపురం : గోదావరి పుష్కరాల సందర్భంగా కె.గంగవరం మండలం కోటిపల్లిలోని గౌతమీ గోదావరిలో వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ కొలువుదీరిన శ్రీ ఛాయా సోమేశ్వరుని దర్శించుకుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతంలోని స్నానఘట్టాల అభివృద్ధి గురించి ప్రభుత్వం అంతగా పట్టించుకోవడంలేదు. పుష్కరాల సందర్భంగా కోటిపల్లి నుంచి బ్రహ్మపురి వర కూ సుమారు 21 కిలోమీటర్ల మేర ఉన్న గోదావరి తీరంలో అధిక సంఖ్యలో భక్తు లు పుణ్యస్నానాలు చేస్తారు. మొత్తం నియోజకవర్గంలో 12 స్నానఘట్టాలకుగా నూ ఒకదాని పనులే ప్రారంభమయ్యా యి. ఆయా స్నానఘట్టాల అభివృద్ధికి రూ.3.60 కోట్లు, కాజులూరు మండలం లో తొగరపాయ తీరంలో రెండు ఘాట్ల అభివృద్ధికి రూ.42 లక్షలు మంజూరయ్యాయి.
కోటిపల్లిలో ఇప్పటికే ఒక స్నానఘట్టం ఉండగా మరో రెండు నిర్మిం చేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఈ మూడింటికీ రూ.1.20 కోట్లు మంజూరవగా, టెండర్ల దశను పూ ర్తి చేసుకుని ఇటీవల పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న రేవును పెంచు తూ శ్మశానవాటిక వరకూ స్నానఘట్టాల నిర్మాణం చేపడుతున్నారు. కూళ్ల మల్లవరం, సుందరపల్లి, దంగేరు, కోట, మసకపల్లి, బ్రహ్మపురి రేవులకు నిధులు కేటాయించినా ఇప్పటివరకూ ఇంకా టెండర్ల దశ పూర్తి కాలేదు. వీటికి మరమ్మతులు మాత్రమే చేయనున్నారు. ఈ పనులు పుష్కరాల నాటికి పూర్తవుతాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గోదావరి తీరాన్ని ఆనుకుని దంగేరు రామఘట్టాల వద్ద స్నానాల రేవును కూడా మరమ్మతులకు మాత్రమే పరిమి తం చేశారు. కోటిపల్లి తరువాత అత్యధికంగా ఇక్కడే భక్తులు పుష్కరాలకు పుణ్యస్నానాలు చేస్తారు. కోటిపల్లి మినహా నియోజకవర్గంలో గోదావరి తీరాన్ని ఆనుకుని ఉన్న మిగిలిన స్నానఘట్టాలవద్ద ఎటువంటి పనులూ ప్రారంభించలేదు. మొత్తమ్మీద నియోజకవర్గంలోని పనులు ఆలస్యం కావడంతో వచ్చిన అరకొర నిధులతో పనుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం కోటిపల్లి స్నానఘట్టాల అభివృద్ధి పనులు మొదలయ్యాయని, మిగిలినవి టెండర్ల దశలో ఉన్నాయని కన్జర్వేటర్ ఏఈ కె.ఈశ్వరమణ్యం ‘సాక్షి’కి చెప్పారు. నియోజకవర్గంలోని 12 స్నానఘట్టాలకు సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
అరకొరగా నిధులు
Published Mon, Mar 9 2015 12:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement