న్యూఢిల్లీ: రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రత్యూష్ సిన్హా కమిటీ సిద్ధం చేసింది. కమిటీ సభ్యులు ఈ నివేదికను మంగళవారం సాయంత్రమే ప్రధాని కార్యాలయ పరిశీలనకు పంపినట్లు తెలిసింది. అక్కడ ఆమోదం లభిస్తే 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత అదే రోజు సాయంత్రం లేదా 17న కేంద్ర హోంశాఖ వెబ్సైట్లో మార్గదర్శకాలను అందుబాటులో ఉంచవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అఖిల భారత సర్వీసు పోస్టులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు ప్రత్యూష్ సిన్హా కమిటీ విభజించింది. దీని ప్రకారం తెలంగాణకు 163 ఐఏఎస్, 112 ఐపీఎస్, 65 ఐఎఫ్ఎస్ పోస్టులను కేటాయించగా, ఆంధ్రప్రదేశ్కు 211 ఐఏఎస్, 144 ఐపీఎస్, 82 ఐఎఫ్ఎస్ పోస్టులు అవసరమని కేంద్రానికి సిఫార సు చేసింది. జిల్లాల నిష్పత్తి ఆధారంగా ఈ కేటాయింపులు జరిపిన విషయం తెలిసిందే.
అధికారులను సంఖ్యాపరంగా విభజన చేసినా, ఎవరిని ఎక్కడికి పంపాలి, ఆప్షన్లు ఇవ్వాలా? వద్దా? అన్న దానిపై మంగళవారం నాటికి కసరత్తు పూర్తయింది. విభజన మార్గదర్శకాల తయారీలో పారదర్శకత, సమన్యాయానికి ప్రాధాన్యమిస్తూనే గతంలో మూడు రాష్ట్రాల విభజన సమయంలో ఉద్యోగుల విభజన చేసిన యూసీ అగర్వాల్ కమిటీ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇక విభజన అనంతరం ఏ రాష్ట్రాల్లో పనిచేస్తారన్న దానిపై అఖిల భారత సర్వీసు అధికారుల నుంచి అనధికారికంగా సీల్డ్ కవర్లో అభిప్రాయాలను ప్రత్యూష్ సిన్హా కమిటీ సేకరించింది. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని, అయితే దానిని హక్కుగా మాత్రం భావించరాదని అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే తమకు కచ్చితంగా ఆప్షన్లు ఉండి తీరాలన్న అఖిల భారత స్థాయి అధికారుల డిమాండ్ పట్ల కమిటీ ఎలా స్పందించిందన్నది తెలియరాలేదు. కన్ఫర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ల విషయంలోనూ నిర్ణయం తీసుకున్నారన్నది సస్పెన్స్గానే ఉంది.
ప్రత్యూష్ సిన్హా నివేదిక సిద్ధం!
Published Thu, May 15 2014 12:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement