టెన్త్ ఫలితాలపై పడనున్న ప్రభావం
సర్కారుకు పట్టని బీసీ విద్యార్థుల వెతలు
రూ.32కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి
ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాశాల విద్యార్థులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థులంతా ఏకాగ్రతతో సమాయత్తమవుతున్నారు. వసతి గృహాల్లో మెరుగైన ఫలితాలకోసం అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ట్యూటర్ల చేత పిల్లలకు పదును పెట్టిస్తున్నారు. జిల్లాలోని 45వసతి గృహాల్లో 1151మంది విద్యార్థులకు 168మంది ట్యూటర్లు ప్రత్యేక క్లాసులు చెబుతున్నారు. కానీ వారికివ్వాలని గౌరవ వేతనాన్ని ఏడు నెలలుగా ప్రభుత్వం చెల్లించడం లేదు.
ఇప్పటివరకు రూ. 22.68లక్షల మేర గౌరవ వేతనం రావాల్సి ఉండగా ఇంతవరకు రూ. 3.38లక్షలే విడుదల చేసింది. ఇంకా రూ.19.35లక్షలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. దాదాపు ఏడు నెలల వేతనం ట్యూటర్లకు అందాల్సి ఉంది. అధికారులు ఇదిగో అదిగో అనడమే తప్ప వారికి న్యాయం చేయలేకపోతున్నారు. పరీక్షలు సమీపిస్తున్న సమయంలో కూడా వారికి న్యాయం జరిగేలా కన్పించడం లేదు. దీనివల్ల టూటర్లలో నిరాసక్తత నెలకొంది. బోధనలో వారు చాలావరకూ శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఈ ప్రభావం రాబోయే ఫలితాలపై పడుతుందేమోనని అధికారులు కలవరపడుతున్నారు.
ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయి రూ.32కోట్లు
కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ. 88కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు రూ. 56కోట్లు మాత్రమే విడుదల చేసింది. విద్యా సంవత్సరం ముగియవస్తున్నా మిగతా రూ. 32కోట్లు విడుదల కాలేదు. దీనిపై ఆధారపడిన 57,772మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు పూర్తి స్థాయిలో జమ కాకపోవడంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు హాల్ టిక్కెట్లు ఇచ్చేందుకు ఇబ్బంది పెడుతున్నాయి.
ఈబీసీ విద్యార్థులూ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. రూ. 15.54కోట్లకు రూ. 9.13కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇంకా రూ. 6.41కోట్లు రావాల్సి ఉంది. 4,257మంది ఈబీసీ విద్యార్థులకు ఫీజు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లైతే మూడేళ్లుగా రావట్లేదు. రూ. 2.45కోట్లకు రూ. 32.44లక్షలే విడుదల చేసింది. అది ఎటూ చాలదన్న ఉద్దేశంతో విడుదలైన నిధులను కూడా చెల్లించలేదు. మరో రూ. 2.13కోట్లు విడుదలైతే తప్ప వీరి సమస్య పరిష్కారం కాదు.
అధైర్యపడొద్దు : బీసీ వేల్ఫేర్ ఇన్చార్జి ఆఫీసర్
వసతి గృహాల్లో పనిచేస్తున్న ట్యూటర్లకు గౌరవ వేతనాలు త్వరలోనే విడుదలవుతాయని, ఇటీవల కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు బీసీ వేల్ఫేర్ ఇన్చార్జి ఆఫీసర్ మనోరమ ‘సాక్షి’కి తెలిపారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ ట్యూటర్లు అశ్రద్ధ వహించకూడదని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ నిధులు కూడా విడుదలవుతాయని చెప్పారు.
ఏడు నెలలుగా ట్యూటర్లకు అందని వేతనాలు
Published Tue, Mar 1 2016 11:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement