తాడేపల్లి రూరల్
డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఉండవల్లి ఇసుక క్వారీని సెర్ఫ్ అదనపు సీఈవో వీరపాండ్యన్ (ఐఏఎస్) శుక్రవారం పరిశీలించారు. ఈ క్వారీకి వచ్చిన ఆయన తొలుత ఇసుక లోడింగ్, అన్లోడింగ్ విధానాన్ని పరిశీలించారు. ఇసుక సరఫరా విషయంలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ఇసుకను సరఫరా చేస్తున్నామని డ్వాక్రా మహిళలు, అధికారులు అదనపు సీఈవోకు తెలిపారు.
రవాణా విషయమై లారీలు, ట్రాక్టర్ల యజమానులను.. మీరు ఎందుకు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని వీరపాండ్యన్ ప్రశ్నించారు. ఏం చేయాలిసార్, ఇసుక రీచ్కు వచ్చిన తర్వాత మూడు రోజులపాటు లోడింగ్ కోసం ఎదురు చూస్తున్నామని, డ్రైవర్, క్లీనర్ల ఖర్చులే రెండు వేలవుతున్నాయని, అదనంగా బేటా ఇవ్వాల్సివస్తోందన్నారు. ఇవన్నీ బేరీజు వేసుకుని ఇసుకను అధిక ధరకు చేరవేయాల్సివస్తోందని రవాణాదారులు వాపోయారు.
ఈ సందర్భంగా సీఈవో విలేకరులతో మాట్లాడుతూ ఇసుక క్వారీల్లో అక్కడక్కడ అవినీతి జరుగుతోందనే అరోపణలు వినిపిస్తున్నాయని, అవి తమ దృష్టికి రాలేదన్నారు. ఇసుక ధరను నియంత్రించేందుకు రవాణాను కూడా ప్రభుత్వమే చేపడుతుందన్నారు. ఇ ందుకుగాను వినియోగదారుని ఇంటికే ఇసుకను సరఫరా చేసేందుకుగాను టెండర్లు పిలిచామన్నారు. ఇకనుంచి ఆన్లైన్ ద్వారా ఇసుక సరఫరా చేస్తామన్నారు. దీంతో వినియోగదారుడు నష్టపోయే అవకాశంలేదన్నారు.
ఇక నుంచి ఇసుక కావలసిన వారు ఆన్లైన్తోపాటు మీ సేవలోనే నగదు చెల్లించాలని, రెండు మూడు రోజుల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. జిల్లాలో త్వరలో మరిన్ని ఇసుక క్వారీలు తెరవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సెర్ఫ్ అదనపు సీఈవో వెంట డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ప్రశాంతి, డీపీవో గ్లోరియా, ఏపీడీవో సుబ్రమణ్యం. మండల ఏపీవో సమాధానం, డ్వాక్రా మహిళలు తదితరులు ఉన్నారు.
ఇసుక ధర నియంత్రణకు రవాణాపై దృష్టి
Published Sat, Nov 1 2014 2:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ఫలాలు
పదేళ్ల మోదీ పాలన అవినీతిమయం
ఆరు గ్యారంటీల పేరుతో 420 అబద్ధాలు
పాలమూరు అభివృద్ధి కోసం ఓటేయండి
మోదీ హయాంలోనే దేశాభివృద్ధి
ఎంపీగా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
నేడు రాహుల్గాంధీ రాక
డీకే అరుణ గెలుపు కోసం కష్టపడాలి
ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యం..: మధుసూదన్రెడ్డి
95 నిమిషాల పాటు సీఎం రోడ్షో, కార్నర్ మీటింగ్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement